ఈ మద్య స్టార్ హీరోల సినిమాలు క్లయిమాక్స్ పైనే ఎక్కువ శ్రద్ద చూపిస్తున్న విషయం తెలిసిందే.  భారీ యాక్షన్ సీక్వెన్స్ తో క్లయిమాక్స్ ముగించేస్తున్నారు.  అంతే కాదు తమ అభిమాన హీరో క్లయిమాక్స్ లో విలన్లను ఓ రేంజ్ లో దుమ్ముదులుపుతారని ఫిక్స్ అయ్యారు. ఆ తరహాలోనే దర్శక, నిర్మాతలు సైతం ప్లాన్ చేస్తున్నారు. హీరో ఫైట్ చేస్తేనే ఫ్యాన్స్ కి పండగ. అయితే కొన్ని సినిమాల్లో మాత్రం ఎమోషన్ తోనో.. లేదంటే ఫన్నీ గానో ఎండ్ కార్డు వేస్తారు.   ఆ మద్య త్రివిక్రమ్ - పవన్ కళ్యాన్ కాంబినేషన్ లో వచ్చిన అత్తారింటికి దారేది మూవీలో ఎమెషనల్ డైలాగ్స్ తో క్లయిమాక్స్ చిత్రీకరించారు.  ఈ ఏడాది వచ్చిన ‘మహర్షి’లో సైతం మంచి మెసేజ్ తో క్లయిమాక్స్ తీశారు.  

 

ఇక అనీల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ నటించిన ‘ఎఫ్ 2 ’ మూవీ క్లయిమాక్స్ చూస్తే పొట్టచెక్కలయ్యేలా నవ్వుకుంటారు.  ఇలా డిఫరెంట్ యాంగిల్స్ లో క్లయిమాక్స్ తీయడం.. మంచి విజయాలు అందుకోవడం జరుగుతుంది.   తాజాగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక మందన జంటగా నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’  సినిమాని  కామెడిగానే క్లైమాక్స్ ని అనిల్ రావిపూడి సెట్ చేసినట్టుగా ఫిలింనగర్ టాక్.  ఈ మద్య రిలీజ్ అయిన ‘సరిలేరు నీకెవ్వరు’  టీజర్ లో మహేష్ బాబు పంచ్ డైలాగ్స్ చాలా ఫన్నీగా ఉన్నాయి.

 

ఈ నేపథ్యంలో సినిమా చివరిలో కూడా యాక్షన్ కాకుండా కామెడీతో సినిమాకి శుభం కార్డ్ వెయ్యబోతున్నారని టాక్.  ఒకప్పుడు మహేష్ బాబు మూవీ అంటే భారీ క్లయిమాక్స్ ఉంటుందని ఫ్యాన్స్ ఊహించేవారు.  అయితే మహర్షిలో ఒక మంచి మెసెజ్ తో క్లయిమాక్స్ పడటం ఫ్యాన్స్ కి తెగ నచ్చిందని టాక్. ఇక సరిలేరు నీకెవ్వరు ఈ సినిమా లో మహేష్ ఆర్మీ లో ఆఫీసర్ గా కనిపిస్తున్నారు. అయితే సినిమా చివరిలో ప్రకాష్ రాజ్ ని భయపెట్టడం, ప్రకాష్ రాజ్ పాత్ర ద్వారా కామెడీ పండిస్తూనే…. రెండు మూడు ఫన్నీ డైలాగ్స్ తో సినిమాని అనిల్ రావిపూడి ముగిస్తాడని తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: