తెలుగు లో వస్తున్న జబర్ధస్త్ కామెడీ షో తో ఎంతో మంది ఔత్సాహిక కళాకారులు వెలుగులోకి వచ్చారు. అలాంటి వారిలో సుడిగాలి సుధీర్ ఒకరు. ఏడు సంవత్సరాల క్రితం ఆరంభం అయిన ‘జబర్ధస్త్’ షోలో తనదైన ముద్ర వేస్తూ వచ్చాడు సుడిగాలి సుధీర్. ఇక సుడిగాలి సుధీర్ టీమ్ లో గెటప్ శీను, ఆటో రాంప్రసాద్, సన్నీ ఈ ముగ్గురితో మనోడు చేసే ప్రతి స్కిట్ కడుపుబ్బా నవ్వులు పూయిస్తుంది. ప్రస్తుతం జబర్ధస్త్ కామెడీ షో తో పాపులర్ అవుతున్న నటులు వెండితెరపై కూడా వెలిగిపోతున్నారు. ఇక గతంలో జబర్ధస్త్ యాంకర్ గా వచ్చిన అనసూయ కొంత కాలం ఈ ప్రోగ్రామ్ కి గుడ్ బాయ్ చెప్పింది. ఆమె స్థానంలో రష్మి గౌతమ్ యాంకర్ గా ఎంట్రీ ఇచ్చింది. తన అందచందాలు.. వచ్చీరాని తెలుగు తో అందరినీ ఆకట్టుకుంది. అయితే జబర్ధస్త్ లో రష్మీ-సుధీర్ ల మద్య ప్రేమాయణం సాగుతుందని ఎన్నో పుకార్లువచ్చాయి.
ఇందుకు తగ్గట్టు ఎక్కడ చూసినా ఈ జంట ప్రత్యక్షం కావడం విశేషం. ఈ జంట ఢీ జోడిలో కూడా కలిసి చేస్తున్నారు. ప్రస్తుతం సుడిగాలి సుధీర్ టాలీవుడ్ లో హీరో అయ్యేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. మొదటి ప్రయత్నంలో సుధీర్ 'సాఫ్ట్ వేర్ సుధీర్' అనే మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో సుధీర్ సరసన ధన్య బాలకృష్ణ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఓ కార్యక్రమంలో తనకూ రష్మీకి ఉన్న సంబంధం గురించి బట్టబయలు చేశాడు సుధీర్. సుధీర్ ఎక్కడకు వెళ్లినా యాంకర్ రష్మీ గురించి ప్రశ్న ఎదురవుతూనే ఉంటుందన్నవిషయం తెలిసిందే. అయితే సోషల్ మీడియాలో అయితే సుధీర్, రష్మీ గురించి ఎలాంటి ప్రచారాలు జరుగుతున్నాయో అందరికి తెలిసిందే.
తమ రిలేషన్ షిప్ గురించి ఎన్ని పుకార్లు వచ్చినా సుధీర్, రష్మీ వాటిని ఖండిస్తూ వచ్చారు. అలీ నిర్వహిస్తున్న ఓ కార్యక్రమంలో రష్మీ గురించి సరదాగా ప్రశ్నించాడు. ఒకవైపు దీపికా పదుకొనె, మరోవైపు ప్రియాంక చోప్రా ఉన్నారు. వారిద్దరిలో ఒకరినే హగ్ చేసుకునే అవకాశం వస్తే ఎవరిని ఎంచుకుంటావు అని అలీ ప్రశ్నించగా.. వెంటనే రష్మీ ఎక్కడ అని అడుగుతానని సుధీర్ సరదాగా సమాధానం ఇచ్చాడు. ఈ సందర్భంగా సుధీర్ మాట్లాడుతూ.. ఏడేళ్లుగా కలిసి పనిచేస్తున్నాం.. తమ మద్య మంచి స్నేహబంధమే ఉందని.. ఎవరెన్ని అనుకున్నా ఐ డోంట్ కేర్ అన్నారు.