ఒక‌ప్పుడు రాక్‌స్టార్ గా తెలుగు సినిమా మ్యూజిక్ ల‌వ‌ర్స్ అభిమానాన్ని అశేషంగా సొంతం చేసుకున్నాడు దేవి శ్రీ ప్ర‌సాద్‌. అయితే ఓ హీరోయిన్ తో ఎఫైర్ ... ఆ త‌ర్వాత ఓ లేడీ సింగ్‌ర్ తో ఎఫైర్ పెట్టుకున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాక దేవి శ్రీ కెరీర్ తిరోగ‌మ‌నంలో వెళుతున్న‌ట్టు ఎక్కువుగా చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. వీటిల్లో ఎంత నిజం ఉందో అన్న‌ది ప‌క్క‌న పెడితే మ్యూజిక‌ల్‌గా ఇటీవ‌ల దేవి శ్రీకి స‌రైన హిట్లు లేవ‌న్న‌ది మాత్రం వాస్త‌వం.

 

ఒక‌ప్పుడు పెద్ద హీరోలు సైతం దేవితో సినిమా చేసేందుకు క్యూలో ఉండేవారు. ఇప్పుడు దేవిని ప‌క్క‌న పెట్టేసి ఇత‌ర భాష‌ల‌కు చెందిన మ్యూజిక్ డైరెక్ట‌ర్ల‌తో ప‌ని చేసేందుకే స్టార్ హీరోలు మొగ్గు చూపుతున్నారు. ఇక దేవి కెరీర్ ప‌రంగా డౌన్ అవ్వ‌డంతోనే ఇప్పుడు థ‌మ‌న్ ఒక్క సారిగా మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చి దూసుకు పోతున్నాడు. ఇక ఇప్పుడు ఫామ్ లో లేని దేవిశ్రీ కెరీర్‌లోనే ఎప్పుడు లేనంత గ‌డ్డు ప‌రిస్థితి ఎదుర్కొంటున్నాడు.

 

దేవి మ్యూజిక్ మరీ తీసికట్టుగా ఉందంటూ విమర్శలు పడుతున్నాయి. తాజాగా సరిలేరు నీకెవ్వరు సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజైంది. మైండ్ బ్లాక్ అనే లిరిక్స్ తో వచ్చిన ఈ పాట నిజంగానే జనాల మైండ్స్ ను బ్లాక్ చేసి పడేసింది. ఇదేం ప‌దాలు..ఇదేం ట్యాన్ రా బాబు అంటూ జ‌నాలు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. ఈ పాట‌ను, పాట‌లోని ప‌దాలును, మ్యూజిక్‌ను, అటు దేవిని క‌లిపి నెటిజ‌న్లు ఓ ఆటాడుకుంటున్నారు.

 

ఈ పాట‌ను చివ‌ర‌కు మ‌హేష్ అభిమానులే ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. ఒకప్పుడు దేవిశ్రీ ధాటికి థ‌మన్ తట్టుకోలేకపోయాడు. అప్పట్లో థ‌మన్ ను అంతా తిట్టేవారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. అదే థ‌మ‌న్ దూసుకు పోతుంటే ఇప్పుడు దేవి పాట‌లు ఎవ్వ‌రికి న‌చ్చ‌డం లేదు. ఏదేమైనా దేవీ ఇప్ప‌ట‌కి అయినా త‌న తీరు మార్చుకుని మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌స్తాడేమో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: