గ‌త నాలుగైదు రోజుల నుంచి సంచ‌ల‌నం సృస్టిస్తున్న విష‌యం హైద‌రాబాద్‌లో జ‌రిగిన వెట‌ర్న‌రీ డాక్ట‌ర్ దిశ హ‌త్య కేస్‌. దేశ వ్యాప్తంగా ఈ ఘ‌ట‌న పై చ‌ర్చ కొన‌సాగుతున్న నేప‌ధ్యంలో... బిగ్ బీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు  ఇప్పుడు మ‌రోసారి తెర‌మీద‌కు వ‌చ్చాయి. అయితే ఈ విషయంపై ప్రజల్లో ఆగ్రహం క‌ట్ట‌లు తెంచుకుంటున్న స‌మ‌యంలో... సెలబ్రిటీలు కూడా ఈ విషయంపై తీవ్రంగా స్పందిస్తున్నారు. అయితే ఇలాంటి సంఘటనపై ముప్పై ఏళ్ల క్రితం అమితాబ్‌ చేసిన వ్యాఖ్యలు ఆయన్న ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నాయి.

 

ఇప్పటికే దిశకు జరిగిన అన్యాయంపై సినీ ప్రముఖలు తీవ్రంగా స్పందించారు. ఆ దుర్మార్గులను ఉరితీయాలంటూ ప్రజా పోరాటలకు తమ మద్ధుతు తెలిపారు. సోషల్‌ మీడియా ద్వారా ఈ దారుణాన్ని ఖండించి వారి వారి ఆలోచ‌న‌ల‌ను పంచుకున్నారు. అన్ని ఇండస్ట్రీలకు చెందిన టాప్‌ హీరోలు ఈ విషయంపై తీవ్రంగా స్పందించటం మొద‌లుపెట్టారు.

 

బాలీవుడ్‌ మెగాస్టార్‌, బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ ఇలాంటి సంఘటనకు సంబంధించి గతంలో చేసిన ఓ కామెంట్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది. 1990లో విడుదలైన `మూవీ` అనే మ్యాగజైన్‌ కవర్‌ పేజ్‌ మీద ఓ వార్తను పబ్లిష్ చేశారు. `అత్యాచారం తప్పదనప్పుడు.. వెనక్కి పడుకొని దాన్ని ఎంజాయ్‌ చేయటమే` అంటూ అమితాబ్‌ చేసిన సంచ‌ల‌న వ్యాఖ్యలు ఆయన్ను ఇబ్బందులు పాలు చేయనున్నాయా? అన్నది ఆ వార్త సారాంశం. అయితే అప్పట్లో ఈ వ్యాఖ్యలు ఎలాంటి ప్రకంపనలు సృష్టించాయో తెలియదుగానీ.. ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో అమితాబ్‌ చేసిన ఆ కామెంట్‌ వైరగా మారింది. 

 

తాజాగా దిశ ఘటన తరువాత అమితాబ్‌ వ్యాఖ్యలను తెర మీదకు తీసుకువచ్చిన కొంత మంది నెటిజెన్లు, బాలీవుడ్ సూపర్‌ స్టార్లే ఇలా మాట్లాడుతుంటే ఇక రక్షణ ఎక్కడ ఉంటుంది అని వ్యాఖ్యానిస్తున్నారు. 
ఎంత పెద్ద సెల‌బ్రెటీ అయినా ఒక‌సారి నోరుజారిన మాట ఎప్ప‌టికైనా వారి మెడ‌కు చుట్టుకుంటుంద‌న్నది ఇది ఒక ఉదాహ‌ర‌ణ‌గా చెప్పుకోవ‌చ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: