బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కంగనా రనౌత్ ఎంత మంచి నటి అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఆమెకు సక్సెస్ లో ఫెయిల్యూర్ లో తోడుంటుంది కంగనా చెల్లెలు రంగోలి. ఎవరైనా కంగనాని టార్గెట్ చేస్తే రంగోలి వారిని టార్గెట్ చేసి విమర్శలు చేస్తుంది. ఇదిలాఉంటే హైదరాబాద్ లో దిశాకు హత్యోదంతంపై ఆమె స్పందించడం జరిగింది. దిశను అన్యాయంగా పొట్టనపెట్టుకున్న నలుగురు నిందితులను శుక్రవారం ఉదయం ఎన్ కౌంటర్ చేయడం జరిగింది.

 

ఈ విషయం తెలియగానే రంగోలి తన హైదరాబాద్ పోలీసులకు తన అభినందనలు తెలియచేసింది. ఈరోజు నా హృదయం గర్వంతో పొంగిపోతుంది.. ఇది న్యూ ఇండియా రాక్షసుల ఇళ్లలోకి దూరి మరీ చంపేస్తాం అంటూ పోలీసులు చూపించారు. అయితే ప్రజలకు రంగోలి ఓ రిక్వెస్ట్ చేసింది. సౌత్ లో హీరోయిన్స్ కు గుడి కడతారని విన్నాను.. దిశను ఎక్కడైతే సజీవ దహనం చేశారో అక్కడే ఆమెకు గుడి కట్టండని చెబుతుంది.   

 

అమ్మవారి అవయవాల వివిధ ప్రదేశాల్లో ఉంటే అక్కడ గుడి కట్టినట్టుగా.. దిశకు కూడా గుడి కట్టి అక్కడ పవిత్రంగా ఆరాధించండి అంటుంది రంగోలి. దిశ తల్లిందండ్రులు కూడా సిగ్గు పడాల్సిన అవసరం లేదని.. వారు తలెత్తుకు తిరగాలని అన్నారు. వారికి ఇంకో కూతురు ఉంది.. ప్రియాంకాకు తగిన గౌరవం ఇవ్వండని అంటుంది రంగోలి. తన ఈ విన్నపాన్ని హైదరాబాద్ వాసులు ఆలోచించండని అంటుంది రంగోలి.  సిని ప్రముఖులు సైతం దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై తమ స్పందన తెలియచేస్తున్నారు.  

 

సరిగా దిశా దశదిన కర్మ రోజే పోలీసులు నిందితులని ఎన్ కౌంటర్ చేయడం విశేషం. దిశా లాంటి ఘటనలు ఇంకా జరుగకుండా ఉండేలా.. అలాంటి ఆలోచనలు వస్తేనే శిక్ష ఎలా ఉంటుందో తెలియచెప్పేలా దిశా కేసు నిందితుల శిక్ష ఉంది. కచ్చితంగా ఇకనుండైనా మహిళ సంరక్షణ మగవాడి బాధ్యతగా.. వారి పట్ల గౌరవంగా ఉండాలని ఆశిద్దాం.   

మరింత సమాచారం తెలుసుకోండి: