ఒక సినిమాకు బడ్జెట్ కంట్రోల్ తప్పిందంటే ఏ నిర్మాతకైనా టెన్షన్ సహజం. అందుకే ఏ నిర్మాత అయినా ఆ మాట బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి. సురేష్ బాబు మాత్రం వెంకీమామ కాస్ట్ ఫెయిల్యూర్ సంగతిని పదే పదే బాహాటంగానే చెప్పేస్తుండడం అందరికి ఆశ్చర్యం కలిగిస్తోంది. తన సోదరుడు వెంకటేష్.. మేనల్లుడు నాగచైతన్యతో వెంకీమామ అనే మల్టీస్టారర్ సినిమాను డి.సురేష్ బాబు అండ్ కో నిర్మించిన విషయం తెలిసిందే. బాబి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈ నెల 13న సోలోగా రిలీజ్ కు సిద్ధమవుతోంది.

 

రియల్ లైఫ్ మామా అల్లుళ్లు తెరపైనా రియాలిటీనే ప్రతిబింబించబోతుండడం అటు వెంకీ ఇటు చైతూ అభిమానుల్లో ఆసక్తి పెంచింది. ఊరి పెద్ద మనిషిగా.. రైతుగా వెంకీ.. బార్డర్ లో సైనికుడిగా నాగచైతన్య..ఈ సినిమాలో కనిపించబోతున్నారు. కానీ ఈ చిత్రానికి అనుకున్నది ఒక్కటి అయినది ఇంకొక్కటి. సినిమా మొదలుపెట్టినప్పుడు అనుకున్న బడ్జెట్ వేరు...ఇప్పుడు తేలిన లెక్క వేరు. అయితే బడ్జెట్ విషయంలో ఈ లెక్కల్ని స్వయంగా సదరు అగ్ర నిర్మాత కం ఎగ్జిబిటర్ కం పంపిణీదారుడు స్వయంగా తమ సంస్థకు చెందిన వ్యక్తుల నుంచే లీకులు చేయించడం పరిశ్రమలో హాట్ టాపిక్ అవుతోంది.

 

ముందు కంపెనీ నుంచి లీకులిచ్చి ఇప్పుడు 54 కోట్లు బడ్జెట్ అయ్యిందంటూ సురేష్ బాబు స్వయంగా ఓపెనవ్వడం ఒక స్ట్రాటజీ అని అర్థమవుతోందని అంటున్నారు. ఈ విషయాన్ని ఆయనే ఎందుకు బయటపెట్టాలి? దీని వెనక ఆంతర్యం ఏమిటి? అంటూ పంపిణీ వర్గాల్లోనూ చర్చ సాగుతోంది. అనూహ్యంగా హైప్ పెంచి బయ్యర్ల నుంచి ఇంకేదైనా ఆశిస్తున్నారనే నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అవుతోంది. అందుకే ఇలా బడ్జెట్ తడిసిమోపెడు అయ్యిందని.. ఆ కారణంగానే సంక్రాంతికి పోటీపడకుండా డిసెంబర్ 13న సోలో రిలీజ్ కు  ప్లాన్ చేశారని మైండ్ గేమ్ ఆడుతున్నారని మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది బాబు కావాలని ఆడుతున్న గేమ్ అన్న వాదనా ఫిలింసర్కిల్స్ లో వినిపిస్తోంది. వాస్తవానికి ఈ సినిమాలో కశ్మీర్ ఎపిసోడ్ హైలైట్. దానికి మినహా బడ్జెట్ ఏమీ పెరగలేదని.. ఆ ఒక్క ఎపిసోడ్ ని చూపించి సురేష్ బాబు సినిమా బడ్జెట్ పెరిగిందని పదే పదే తన టీమ్ తో ప్రచారం చేయిస్తున్నాడని సినిమా బాగుంటేనే ఈ మధ్య ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారని అది ఆయన గ్రహించాలని కొంత మంది బయ్యర్లు ఇన్‌డైరెక్ట్ గా చెబుతున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: