మక్కళ్‌ నీది మయ్యం పార్టీని  కమలహాసన్‌  ప్రారంభించి ఇప్పటికే  రాజకీయాల్లో ఉన్న విషయం తెలిసిందే. అయినా ఆయన  సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఇండియన్‌–2 చిత్రంలో శంకర్‌ దర్శకత్వంలో నటిస్తున్నారు.  ఇప్పటికే ఈ చిత్రం చిత్రీకరణలో ఉంది. దీని తరువాత కమలహాసన్‌ ఇప్పటికే  తలైవన్‌ ఇరుకిండ్రాన్‌ చిత్రాలో నటించనున్నట్లు ప్రకటించారు. అయితే ఆ తరువాత నటనకు స్వస్తి చెప్పి పూర్తిగా రాజకీయాలపైనే దృష్టి పెట్టనున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఇక విషయానికి వస్తే  రజనీకాంత్‌ కూడా  రాజకీయాల్లోకి వస్తున్నానంటున్నారు. అయితే ఇంకా పార్టీని మాత్రం ప్రకటించడంలో  ఎందుకో వెనకాడుతున్నారు .ప్రస్తుతం రజనీకాంత్‌ తాజాగా దర్బార్‌ చిత్రాన్ని ఏఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో పూర్తి చేసిన  శివ దర్శకత్వంలో నటించడానికి ఆయన సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రం గురించి ఇప్పటికే అధికారం, అనధికారం అంటే బోలెడంత ప్రచారం హోరెత్తుతోంది. అయితే ఈ చిత్రం తరువాత కూడా రజనీకాంత్‌ నటించనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే  2021లో జరగనున్న శాసనసభ ఎన్నికలకు రజనీకాంత్‌ సిద్ధం అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. కాగా ఇటీవల   కమలహాసన్‌ పుట్టినరోజు సందర్భంగా  ఒక కార్యక్రమంలో రజనీకాంత్‌ పాల్గొన్నారు. ఆ వేదికపై రజనీకాంత్‌ గురించి కమలహాసన్‌ మాట్లాడుతూ తమది 40 ఏళ్ల స్నేహం అని పేర్కొన్నారు.

 

అంతేకాదు రజనీకాంత్‌ రాజకీయరంగ ప్రవేశం చేసినా, నటనను కంటిన్యూ చేస్తారని చెప్పారు. ఇక  రాబోయే కాలంలో పలు ఆసక్తి కరమైన సంఘటనలు రజనీకాంత్‌ జరుగుతాయని అన్నారు. అంతటితో ఆగకుండా అవసరం అయితే తామిద్దరం కలిసి పనిచేస్తామని పేర్కొంటూ రాజకీయవర్గాల్లో ప్రకంపనలు సృష్టించారు. కాగా రాజకీయంగా కమల్, రజనీ కలుస్తారో? లేదో గానీ, సినిమాలో మరోసారి కలవనున్నారన్నది తాజా సంచలన వార్త.

 

కమలహాసన్, రజనీకాంత్‌ గతంలో  పలు చిత్రాల్లో కలిసి నటించారు. అయితే కొంతకాలం తరువాత ఎవరికి వారు సొంత ఇమేజ్‌ను సంపాదించుకోవడంతో ఇకపై కలిసి నటించకూడదని వారిద్దరూ కలిసి నిర్ణయం తీసుకున్నారు. అలా  విడి విడిగానే 40 ఏళ్ల నుంచి నటిస్తున్నారు. అలాంటిది ఇప్పుడు తాజాగా సామాజిక మాధ్యమాల్లో ఒక చిత్రంలో కలిసి పనిచేయడానికి సిద్ధం అవుతున్నట్లు  వైరల్‌ అవుతున్న వార్త. కాగా యువ నటుడు లోకేశ్‌ కనకరాజ్‌ కార్తీ హీరోగా తెరకెక్కించిన ఖైదీ చిత్రం ఆ మధ్య విడుదలై మంచి విజయంతో పాటు విమర్శకుల ప్రశంసలను అందుకుంది.

 

ఈ చిత్రాన్ని చూసిన రజనీకాంత్‌ ఫోన్‌లో దర్శకుడు లోకేశ్‌ కనకరాజ్‌ను అభినందించారు. లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకత్వం వహిస్తున్నచిత్రం  నటుడు విజయ్‌ 64వ చిత్రం ,  ఈ చిత్ర షెడ్యూల్‌ పూర్తి అయిన తరువాత తనను అభినందించిన నటుడు రజనీకాంత్‌ను నేరుగా కలిసి కృతజ్ఞతలు చెప్పారు. అయితే వీరి కలయిక ఆసక్తిని రేకెత్తించింది.లోకేశ్‌ కనకరాజ్‌  రజనీని దర్శకత్వం వహించనున్నట్టు  ప్రచారం హల్‌చల్‌ చేసింది. అయితే అప్పుడు వారి కలయికలో చాలా విషయాలు చర్చకు వచ్చినట్లు తెలిసింది. అందులో ముఖ్యంగా దర్శకుడు లోకేశ్‌కనకరాజ్‌ నటుడు రజనీకాంత్‌కు ఒక కథ వినిపించినట్లు, అది ఆయనకు నచ్చినట్లు టాక్‌. ఇక మరో సంచలన అంశం ఏమిటంటే లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ నటించే చిత్రాన్ని కమలహాసన్‌ తన రాజ్‌కమల్‌ సినీ ఇంటర్నేషనల్‌ సంస్థలో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం. అంతే కాదు ఈ సంచలన చిత్రంలో గెస్ట్‌ పాత్రలో  కమల్‌  మెరవనున్నట్లు టాక్‌ స్ప్రెడ్‌ అవుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: