దేశవ్యాప్తంగా తో పాటు రెండు తెలుగు రాష్ట్రాలలో దిశ హత్య కేసులో నలుగురు నిందితులను తెలంగాణ పోలీసులు ఎన్ కౌంటర్ చేయడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దిశ ఆత్మకు శాంతి చేకూరిందని సరైన న్యాయం దేశంలో జరిగిందని తెలంగాణ పోలీసులపై ప్రశంసల వర్షం కురిపించి ఇటువంటి ఘటనకు పాల్పడిన ప్రతి ఒక్కరిని వివిధ రాష్ట్రాలలో జైల్లో ఉన్న మానవ మృగాలను ఆ రాష్ట్రానికి చెందిన పోలీసులు తెలంగాణ పోలీసులు చేసిన మాదిరిగానే ఎన్ కౌంటర్ చెయ్యాలని చాలా మంది నెటిజన్లు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది రాజకీయ నాయకులు మరియు అదే విధంగా సెలబ్రిటీలు టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు తెలంగాణ పోలీసులు చేసిన ఎన్ కౌంటర్ పట్ల ఎవరికి వారు తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో తెలియజేస్తూ వస్తున్నారు.

 

ఇటువంటి తరుణంలో హీరో రాజశేఖర్ సతీమణి, నటి జీవిత స్పందించారు. తెలంగాణ పోలీసులని ఆమె అభినందించారు. విచారణని పోలీసులు వేగంగా చేపట్టారు. ఎన్ కౌంటర్ సంఘటనపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా నిందితులలో ఒకరు ఎన్ కౌంటర్ అయినా ఏ4 గా ఉన్న చెన్నకేశవులు భార్య రేణుక చేసిన కామెంట్స్ పై జీవిత రాజశేఖర్ తీవ్రస్థాయిలో స్పందించారు. కోర్టు శిక్ష విధించకముందే పోలీసులు ఎలా ఎన్ కౌంటర్ చేస్తారు అని చెన్నకేశవులు భార్య రేణుక ఆవేదన వ్యక్తం చేస్తోంది. దీనిపై జీవిత మాట్లాడుతూ.. ఒక భార్యగా ఆమెకు ఆవేదన ఉండొచ్చు.

 

కానీ మేమే అత్యాచారం చేశాం, మేమే హత్య చేశాం అని పోలీసుల ఎదుట ఒప్పుకున్నారు. ఇంతకంటే ఆధారాలు ఇంకేం కావాలి. తన భర్త చనిపోయిన బాధలో ఆమె మాట్లాడుతోంది. కానీ అలాంటి భర్త ఆమెకు అవసరమా అని జీవిత ప్రశ్నించారు. ఇటీవలే తన భర్త మోసం చేశాడని చెన్నకేశవులు భార్య రేణుక తెలపడం జరిగింది ప్రస్తుతం అతడు చనిపోవడంతో ఆ బాధను అతని భార్య అలా మాట్లాడుతుంది అంటే జీవిత రాజశేఖర్ స్పందించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: