గత కొద్దిరోజలుగా ఈటివి ఛానల్ లో ప్రసారం అవుతున్న జబర్దస్త్ షోలో కొంత గందరగోళ పరిస్థితులు ఎదురవుతున్నట్లు తాజాగా వరుసగా జరుగుతున్న ఘటనలను బట్టి చూస్తే కొంత అర్ధం అవుతుంది. ఇటీవల షో నుండి జడ్జీగా వ్యవహరిస్తున్న నాగబాబు బయటకు రావడం, అలానే ఆయన తరువాత యాంకర్ అనసూయ మరియు చమ్మక్ చంద్ర కూడా షో నుండి బయటకు వచ్చారు. 

 

కాగా ఆ షో నిర్వాహక సంస్థైన మల్లెమాల లోని కొందరు మేనేజ్మెంట్ సభ్యుల పని తీరు తనకు నచ్చకపోవడం వల్లనే ఆ షో నుండి బయటకు వచ్చినట్లు చెప్పారు నాగబాబు. ఇక నాగబాబుతో పాటు బయటకు వచ్చిన అనసూయ మరియు చమ్మక్ చంద్రలలో, సడన్ గా చమ్మక్ చంద్ర నిన్న జబర్దస్త్ కు రిఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇక ఈ ఘటనతో నాగబాబుకు కొంత షాక్ కొట్టినట్లు తెలుస్తోంది. నిజానికి నాగబాబు వెంట బయటకు వచ్చిన చంద్రను, కొద్దిరోజుల క్రితం, మల్లెమాల టీమ్ ప్రత్యేకంగా పిలిపించి మాట్లాడిందని, అంతేకాక అతడికి రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచుతాం అని మాట ఇవ్వడంతో చంద్ర మళ్ళి షోలోకి ఎంట్రీ ఇచ్చినట్లు వార్తలు ప్రచారం అవుతున్నాయి. 

 

తనకు అన్ని విధాలా గుర్తింపుని ఇవ్వడంతో పాటు ఆర్ధికంగా తన ఎదుగుదలకు కారణం అయిన జబర్దస్త్ ను వీడడం ఒకింత చంద్ర కు కూడా ఇష్టం లేదని, అందుకే అతడు షోకు తిరిగి వచ్చినట్లు చెప్తున్నారు. వాస్తవానికి మొదట్లో నాగబాబు వెంట చంద్రతో పాటు మిగతా పార్టిసిపెంట్స్ మరికొందరు కూడా బయటకు వస్తారని అందరూ భావించారు. అయితే ఆ ఘటనతో ఒక్కసారిగా అలర్ట్ అయిన మల్లెమాల సంస్థ, వెనువెంటనే మిగతా పార్టిసిపెంట్స్ తో మాట్లాడి వారిని బయటకు వెళ్లనీయకుండా గట్టిగా ఒప్పందం చేసుకుందని టాక్. కాగా ఈ తాజా ఘటనలతో అసలు జబర్దస్త్ విషయమై ఏమి జరుగుతుందో, అసలు ఈ షో ఇకపై ముందుకు సాగుతుందో లేదో అర్ధం కాక ప్రజలు తలలు పట్టుకుంటున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: