బాలీవుడ్ హాట్ హీరోయిన్ దీపాన్నిత శర్మ బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ పై సీరియస్ అయింది. విషయంలోకి వెళితే అందువల్ల సంజయ్ దత్ నటించిన ‘పానిపట్’ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా కపిల్ శర్మ షో కి వెళ్లడం జరిగింది. అయితే ఆ షోలో కపిల్ శర్మ...నటుడు సంజయ్ దత్ కె ఒక ప్రశ్న వేయడం జరిగింది. ఇంటికి ఆపరేషన్ ఏమిటంటే మీ 300 మంది గర్ల్‌ఫ్రెండ్స్ ప్రస్తుతం ఎలా ఉన్నారు..? అని కపిల్ శర్మ ప్రశ్నించారు. దీనికి సంజయ్ దత్ ప్రతిస్పందిస్తూ..‘నాకు ఎంత మంది గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారో ఇంకా లెక్కపెట్టలేదు. కృతి సనన్‌ను నా 308వ గర్ల్‌ఫ్రెండ్‌ చేసుకోవాలని అనుకుంటున్నా’ అని చమత్కరించారు.

 

సంజయ్ దత్ ఇచ్చిన ఆన్సర్ కి ఆ షోలో ఉన్న ఆడియన్స్ తో పాటు కపిల్ శర్మ పగలబడి నవ్వారు. అయితే సంజయ్ దత్ ఇచ్చిన ఆన్సర్ పై హీరోయిన్ దీపాన్నిత శర్మ సీరియస్ అయింది. ఇటువంటి ప్రశ్నకి దేశంలో మరొక అమ్మాయి చెప్పి ఉంటే ఆ షోలో ఉన్నవాళ్లు నవ్వుతారా? అని ప్రశ్నించింది. ‘తన సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి ఓ షోకి వెళ్లిన ఓ నటుడు.. తనకున్న 300 మంది గర్ల్‌ఫ్రెండ్స్ గురించి గొప్పగా చెప్పుకున్నాడు.

 

అతని మాటలు విని కపిల్ శర్మతో పాటు ఆడియన్స్ కూడా పగలబడి నవ్వుకున్నారు. ఒకవేళ అదే షోలో ఓ అమ్మాయి ఈ మాట అంటే ఇలాగే సరదాగా నవ్వి ఊరుకునేవారా? దాన్ని కూడా జోక్‌గా తీసుకునేవారా? ఈ అసమానత్వమే అన్ని తప్పులకు కారణం’ అని ట్వీట్ చేశారు. దీంతో దీపాన్నిత శర్మ చేసిన కామెంట్లు సోషల్ మీడియా తో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి. చాలామంది సోషల్ మీడియాలో నెటిజన్లు దీపాన్నిత శర్మ చేసిన పోస్టు చాలా కరెక్ట్ అని అందరిని ఆలోచనలో పడేసింది అంటూ ఆమె పై పొగడ్తల వర్షం కురిపించారు. అయితే ఈ పోస్ట్ పై ఇంకా సంజయ్ దత్ ప్రతి స్పందించలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: