టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస విజయాలు అందుకుంటున్న విషయం తెలిసిందే.  కొరటాల శివ దర్శకత్వంలో ‘శ్రీమంతుడు’ లాంటి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న మహేష్ బాబు...వరుసగా ఆ తరహా సినిమాల్లోనే నటిస్తున్నాడు.  కొరటాలతో ‘భరత్ అనేనేను’, వంశి పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ రెండూ మంచి మెసేజ్ ఓరియెంటెడ్ మూవీస్.  అయితే మహేష్ బాబు నుంచి ఎప్పుడు కొత్తదనాన్నిఆశించే అభిమానులు వరుస మెసేజ్ మూవీస్ తో నిరాశపడుతున్నారు.  ఈ నేపధ్యంలో కామెడీ మూవీస్ కి పెట్టింది పేరైన అనీల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన మూవీ టైటిల్‌ సాంగ్‌, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌, టీజర్‌, 'మైండ్‌ బ్లాక్‌'సాంగ్‌ ఓ రేంజ్‌లో ఉన్నాయి.

 

టీజర్ తో సూపర్ స్టార్ మహేష్ బాబు తన స్టామినా ఏంటో మరోసారి నిరూపించారు. 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో తన క్రేజ్‌ను మరింత పెంచుకుంటున్నారు.  మరోవైపు ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీకి సంబంధించి వరుసగా ప్రమోషన్లు మొదలయ్యాయి.   ప్రమోషన్‌లో భాగంగా ఐదు సోమవారాలు ఐదు పాటలను రిలీజ్‌ చేయనున్నట్లు చిత్ర బృందం ఇది వరకే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే మైండ్‌ బ్లాక్‌ సాంగ్‌ను రిలీజ్‌ చేయగా వచ్చే సోమవారం మరో పాటను రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.  'సూర్యుడివో చంద్రుడివో'అంటూ సాగే మెలోడీ పాటను సోమవారం సాయంత్రం 5:04 గంటలకు రిలీజ్‌ చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.  అంతే కాదు ఈ సాంగ్‌కు సంబంధించి ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్‌ చేసింది. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీలో మహేశ్‌ సరసన రష్మికా మండన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు.

 

దాదాపు 25 సంవత్సరాల తర్వాత ఈ సినిమాతో లేడీ సూపర్‌ స్టార్‌ విజయశాంతీ రీఎంట్రీ ఇస్తున్నారు.  ఈ పాట గురించి రామజోగయ్య ఓ మేసేజ్ పెట్టారు... 'మంగళకరమైన మాధుర్య ప్రధానమైన సంగీతానికి మనిషి తనం తాలూకు భావోద్వేగం తోడైతే ఇలాంటి పాట పుడుతుంది. చాలా సంతృప్తిగా ఉన్నా అన్నారు. . రాజేంద్ర ప్రసాద్‌, ప్రకాష్‌ రాజ్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 'దిల్‌' రాజు, రామబ్రహ్మం సుంకర, మహేశ్‌ బాబు నిర్మిస్తున్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతమందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: