గత కొన్ని రోజుల రెండు తెలుగు రాష్ట్రాల తో పాటు దేశవ్యాప్తంగా దిశ అత్యాచారం హత్య ఘటన సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనకు పాల్పడిన నిందితులను తెలంగాణ పోలీసులు ఎన్కౌంటర్ చేయటంతో దేశంలో ఉన్న చాలామంది తెలంగాణ పోలీసులపై చేసిన ఎన్కౌంటర్ పై హర్షం వ్యక్తం చేస్తూ దేశంలో మరో ఆడదాని పై చేయి వేయాలంటే మగాళ్ల రూపంలో ఉన్న మృగాలు ఆలోచించేలా తెలంగాణ పోలీసులు సరైన శిక్ష ఎన్కౌంటర్ రూపంలో ఆ నలుగురు కి విధించారని దిశ కి సరైన న్యాయం చేశారని సోషల్ మీడియాలో మరియు ఎలక్ట్రానిక్ మీడియా లో చాలామంది పబ్లిక్ మరియు నెటిజన్లు పొగడ్తల వర్షం కురిపించారు. ఇదే తరుణంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన చాలా మంది హీరోలు డైరెక్టర్లు హీరోయిన్లు దిశ అత్యాచారం హత్య ఘటనపై తమదైన శైలిలో స్పందించారు.

 

అంతేకాకుండా దేశంలో మరొకటి ఇలాంటి ఘటనలు జరగకుండా కొత్త చట్టాలు తీసుకురావాలి అని సోషల్ మీడియాలో టాలీవుడ్ సెలబ్రిటీలు కోరుతున్నారు. ఇటువంటి తరుణంలో డైరెక్టర్ బోయపాటి …. బాలయ్య బాబు తో చేయబోయే సినిమాలో దిశ ఘటనకు సంబంధించి సీన్ యాడ్ చేయడం కోసం స్క్రిప్ట్ మార్చుకున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి. విషయంలోకి వెళితే సినిమాలో అమ్మయిల హత్యాచార ఘటనకు సంబందించిన విషయాన్నీ ప్రస్తావించనున్నాడట.

 

ఎన్ కౌంటర్ జరిగిన రోజే బాలకృష - బోయపాటి కాంబినేషన్ సినిమా స్టార్ అయ్యింది. అయితే ఘటన జరిగిన రోజు రాత్రి బాలకృష్ణ సినిమా స్క్రిప్ట్ లో ఒక చేంజ్ చేయమని అడిగారట. దిశ ఘటనను ఆధారంగా చేసుకొని మంచి సందేశం ఇచ్చేలా సీన్ క్రియేట్ చేయాలనీ బోయపాటిని బాలయ్య డిమాండ్ చేయడంతో బోయపాటి కూడా ఓకే అన్నట్లు సడన్ గా స్క్రిప్ట్ మొత్తం చేంజ్ చేసినట్లు ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి. కాగా మరో పక్క బాలకృష్ణ కూడా దిశ ఘటన విషయంలో పోలీసులు ఎన్కౌంటర్ చేయడం పట్ల ప్రశంసలు తెలపడం జరిగింది. అయితే మరోపక్క త్వరలోనే బోయపాటి తో చేయబోయే సినిమా రెగ్యులర్ షూటింగ్ లో బాలయ్య బాబు పాల్గొననున్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: