మణిరత్నంకు ఏదీ కలిసి రావట్లేదు. ఎవరిని టచ్ చేసినా.. మణికి షాకులే తగులుతున్నాయి. ఈ వెటరన్ డైరెక్టర్ ను అందరూ సమస్యల్లో పడేస్తున్నారు. రీసెంట్ గా అమలాపాల్ కూడా ఈ మేకర్ కు ఝలక్ ఇచ్చింది. 

 

రాజరాజచోళుడు కథాంశంతో పొన్నియిన్ సెల్వన్ సినిమా తీస్తున్నాడు మణిరత్నం. భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ సినిమాలో విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్యరాయ్, కీర్తి సురేష్, అమలాపాల్ ను లీడ్ రోల్స్ కు తీసుకున్నాడు మణి. ఈ నెలలో  రెగ్యులర్ షూటింగ్ చేసుకోబోతోంది. అయితే ఈ టైమ్ లో అమలాపాల్ సినిమా నుంచి తప్పుకొని మణిరత్నంకు షాకిచ్చింది. 

 

మణిరత్నం చాలా కాలంగా ఫ్లాపులతో ఫైట్ చేస్తున్నాడు. ఈ పరాజయాలకు బ్రేకులేసేందుకు పొన్నియిన్ సెల్విన్ తీస్తున్నాడు. అయితే ఈ ప్రాజెక్ట్ కే స్టార్ కాస్టింగ్ తో బ్రేకులు పడుతున్నాయి. ఏరికోరి తీసుకున్న అమలాపాల్ ఈ సినిమా నుంచి తప్పుకుంది. దీంతో డిసెంబర్ లో స్టార్ కావాల్సిన షూటింగ్ మరికొంత కాలం వాయిదా పడే ప్రమాదముందని చెబుతున్నారు. 

 


మార్చి, ఏప్రిల్ లో స్టార్ట్ కావాల్సిన షెడ్యూల్స్ ఈ నెలలో జరుగుతున్నాయి. దీంతో ఈ సినిమా డేట్స్ మరో ప్రాజెక్ట్ తో క్లాష్ అవుతున్నాయని పొన్నియిన్ సెల్వన్ నుంచి తప్పుకుంది అమల. అయితే మణిరత్నం ఇంతకుముందులా ఫుల్ ఫామ్ లో ఉండుంటే.. అమలాపాల్ మిగతా సినిమాలను పక్కన పెట్టి మరీ పొన్నియిన్ కే డేట్స్ ఇచ్చేదని కోలీవుడ్ జనాలు చెప్పుకుంటున్నారు. నాలుగు ఫ్లాపులు రాగానే మణిరత్నంను తక్కువగా చూస్తున్నారని చాలామంది బాధపడుతున్నారు. 

 

మణిరత్నం అంటే ఇండియన్ సినిమాలో ఓ స్పెషల్ ఇమేజ్ ఉంది. సౌత్ నుంచి నార్త్ వరకు మణికి ఎంతో మంది అభిమానులున్నారు. ఈయన సినిమాలతో పాటు పెరిగిన వాళ్లూ ఉన్నారు. అలాంటి దర్శకుడికి దమ్కీలు ఇస్తున్నారు సౌత్ స్టార్లు. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొనియిన్ సెల్వన్ కు కాల్షీట్లు ఇచ్చినట్టే ఇచ్చి.. షూటింగ్ కు వచ్చేసరికి తప్పుకుంటున్నారు. 

 

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: