స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (బన్నీ) హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా అల వైకుంఠపురములో. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ - బన్నీ కాంబినేషన్ అంటేనే మామూలు క్రేజ్ ఉండదు. గతంలో వీరి కాంబోలో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు అల వైకుంఠపురంలో సినిమాతో వీళ్లిద్దరు ఖచ్చితంగా హిట్ కొడతామన్న కాన్ఫిడెంట్ తో ఉన్నారు.
ఇక అక్టోబర్ నాటికే ఈ సినిమా షూటింగ్ అంతా కంప్లీట్ కావాల్సి ఉంది. నవంబర్ నుంచి సుకుమార్ సినిమా షూటింగ్కు వెళ్లిపోవచ్చని బన్నీ ప్లాన్లో ఉన్నాడు. అయితే బన్నీ ప్లాన్ అంతా త్రివిక్రమ్ వల్ల రివర్స్ అయ్యింది. త్రివిక్రమ్ సినిమాను చాలా లేట్ గా షూట్ చేస్తూ వచ్చాడు. దీంతో అటు బన్నీ డేట్లు చాలా వరకు అక్కడే ఖిట్ అయ్యాయట.
సినిమా సంక్రాంతికి డేట్ ఇచ్చినా.. ఓ వైపు ప్రమోషన్లు జోరుగా జరుగుతున్నా కూడా అల వైకుంఠపురములో కి సంబంధించి ఒక సాంగ్, క్లైమాక్స్ పోర్షన్, కొంత ప్యాచ్ వర్క్ మిగిలి ఉందిట. ఇక షూటింగ్ బాగా లేట్ అవ్వడంతో బడ్జెట్ కూడా అనుకున్న దానికంటే చాలా ఎక్కవే అయ్యిందంటున్నారు.
బన్నీకి మార్కెట్ ఉంది కాబట్టి.. బిజినెస్కు ఇబ్బంది లేకపోయినా ఇప్పుడు టార్గెట్ మాత్రం చాలా ఎక్కువగానే ఉంది.
పైగా సంక్రాంతికి మహేష్, కళ్యాణ్ రామ్, రజనీకాంత్ సినిమాలు పోటీగా ఉన్నాయి. ఈ పోటీ తట్టుకుని భారీ టార్గెట్ అంటే ఎలాంటి స్టార్ హీరోకు అయినా కష్టమే. వసూళ్లు తక్కువుగా వచ్చినా సినిమాకు టాక్ బాగున్నా నిర్మాతలకు మిగిలేది తగ్గిపోతుంది అనడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే త్రివిక్రమ్ సినిమాను బాగా లేట్ చేయడంతో ఇప్పుడు బన్నీ కూడా త్రివిక్రమ్పై అసహనంతో ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ చిత్రంలో బన్నీ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా టబు, సుశాంత్, నివేద పేతురాజ్, నవదీప్, రాహుల్ రామకృష్ణ, సునీల్ వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్ సంగీత దర్శకుడు.