వరుసగా రెండు బ్లాక్ బస్టర్ తన కెరియర్ లో ఇచ్చిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కి ‘నాపేరు సూర్య’ సినిమా వంటి దారుణమైన ఫ్లాప్ తర్వాత మూడో సినిమా చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ‘అలా వైకుంఠపురం లో’ అనే సినిమా స్టార్ట్ చేశాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ కావడంతో మూడో సినిమా గా రాబోతున్న ‘అలా వైకుంఠపురం లో’ సినిమాపై అంచనాలు బీభత్సంగా పెట్టుకున్నారు అల్లు అర్జున్ అభిమానులు. చాలా వైవిధ్యమైన కథతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు గట్టిగా వినబడుతున్నాయి. వచ్చే సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ సినిమాకి సంబంధించిన పాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్ లో రికార్డుల మీద రికార్డులు సృష్టించి సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి.
ఇదిలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ఆదివారం నాడు విడుదల చేస్తున్నట్లు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించడం జరిగింది. కానీ ప్రస్తుతానికి 'అల వైకుంఠపురములో' టీజర్ అప్డేట్ను వాయిదా వేస్తున్నట్టు గీతా ఆర్ట్స్ ప్రకటించింది. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ మెగా ఫ్యాన్స్ ప్రెసిడెంట్ నూర్ భాయ్ ఈరోజే మృతిచెందడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ‘తమ కుటుంబ సభ్యుల్లో ఒకడైన నూర్ భాయ్ మరణం కలచివేసింది. ఇటువంటి విషాద సమయంలో ‘అల వైకుంఠపురములో’ టీజర్కు సంబంధించిన అప్డేట్ను ప్రకటించడం సరైనది కాదని భావిస్తున్నాం.
త్వరలోనే టీజర్కు సంబంధించిన వివరాలను ప్రకటిస్తామ’ని గీతా ఆర్ట్స్ సంస్థ ప్రకటించడం జరిగింది. దీంతో అభిమానులు కొంత నిరుత్సాహం చెందిన గాని అల్లుఅర్జున్ అభిమానులకు ఇష్టంగాప్రయారిటీ బట్టి ఎంతగానో సంతోషిస్తున్నారు. అంతేకాకుండా వచ్చే సంక్రాంతికి ‘అలా వైకుంఠపురం లో’ సినిమాతో త్రివిక్రమ్-బన్నీ కాంబినేషన్ లో హ్యాట్రిక్ హిట్ పడాలని కోరుకుంటున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ తో పాటుగా హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుండగా సీనియర్ హీరోయిన్ టాబు మరియు అక్కినేని సుశాంత్ ప్రత్యేకమైన పాత్రలో నటిస్తున్నారు.