దిశ అత్యాచారం ఘటన జరిగిన క్రమంలో సోషల్ మీడియాలో టాలీవుడ్ సెలబ్రిటీలు ఎవరికివారు కామెంట్లు చేస్తూ దేశంలో మరొక ఆడదానికి అటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి రాకూడదని కోరుకుంటున్న తరుణంలో పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో చేస్తున్న కామెంట్లు పోస్ట్ లు టాలీవుడ్ ఇండస్ట్రీలో మరియు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అవుతున్నాయి. ముఖ్యంగా రెండు బెత్తం దెబ్బలు అని కామెంట్ పెట్టి పోస్ట్ పెట్టి డిలీట్ చేసి రచ్చ రచ్చ చేస్తున్న పూనమ్ కౌర్ కామెంట్ల పట్ల తాజాగా పూనమ్ కౌర్ అసలు ఆ వార్త ఆ కామెంట్ పెట్టింది నేను కాదు నా పేరు పైన ఎవరో ఫేక్ ఫోటో ను తయారు చేసి ఫోటో షాపులో ఆ విధంగా చిత్రీకరించి నన్ను టార్గెట్ చేయిస్తున్నారని పూనమ్ కౌర్ ఇటీవల క్లారిటీ ఇచ్చారు.

 

గతంలో 2019 ఎన్నికల సమయంలో కూడా ఇదే విధంగా తనపై అనవసరమైన వార్తలు సృష్టించి వైరల్ చేశారని దానివల్ల నేను నా కుటుంబం చాలా సఫర్ అయ్యాను అంటూ ఇలాంటి పనులు మరొకసారి చేయవద్దని… ఇది కావాలని నా పై కుట్రపన్నారు సోషల్ మీడియాలో నా పేరు పై అనవసరమైన కామెంట్లు ఫొటోషాప్ ద్వారా చేస్తూ చిత్రీకరిస్తున్నారని సైకోల ప్రవర్తిస్తున్నారని...ఇలా అసత్య ప్రచారం చేసేవారికంటే వ్యభిచారులే నయం అని పూనమ్ కౌర్ దుమ్మెత్తి పోసింది.

 

కొంతమంది పనిగట్టుకుని నన్ను టార్గెట్ చేస్తూ చాలా చీప్ గా బిహేవ్ చేస్తున్నారు అని పూనమ్ కౌర్ తెలిపింది. దీంతో ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది కావాలని పూనమ్ కౌర్ పేరుని అడ్డంపెట్టుకుని కొన్ని అనవసరమైన రాజకీయ శక్తులు ఇండస్ట్రీలో చెందిన ఒక హీరో పై రాజకీయ నాయకుడి పై చేస్తున్న దుష్ప్రచారం అని సదరు హీరో కి సంబంధించిన అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: