టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం పూజా హెగ్డే టైం నడుస్తోంది. వేరే ఏ ఇతర స్టార్ హీరోయిన్లు లేకపోవడంతో వరుస ఆఫర్లు భారీ ప్రాజెక్టుల్లో దక్కించుకుని కెరియర్ ని అద్భుతంగా కొనసాగిస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద ప్రాజెక్టుల సినిమాలలో... స్టార్ హీరోల పక్కన హీరోయిన్ గా నటిస్తూ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ భారీ డైరెక్టర్లకు వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. నాగచైతన్య నటించిన “ఒక లైలా కోసం ” అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే ...మొట్టమొదటి సినిమాతోనే మంచి విజయం సాధించడంతో తర్వాత వెంటనే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హరీష్ శంకర్ దర్శకత్వంలో “దువ్వాడ జగన్నాధం “ అనే సినిమాలో అవకాశం దక్కించుకుంది.

 

ఇదే తరుణంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన “అరవింద సమేత వీర రాఘవ” సినిమా లో కూడా అవకాశం దక్కించుకుని మంచి హిట్ తన ఖాతాలో సొంతం చేసుకుంది. తర్వాత వెంటనే మహేష్ బాబు తో మహర్షి సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకుని ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న అల వైకుంఠ పురం లో హీరోయిన్ గా చేస్తోంది. ఇదే తరుణంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు దక్కించుకుంటూ “హౌస్ ఫుల్ 4” అనే సినిమాలో నటించి మంచి ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

 

ఇదిలా ఉండగా తాజాగా పూజా హెగ్డే బాలీవుడ్ ఇండస్ట్రీలో రెండు పెద్ద సినిమాలకు ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. విషయంలోకి వెళితే ఇటీవల సోషల్ మీడియాలో ఇంస్టాగ్రామ్ లో అభిమానులతో వీడియో చాట్ లో పూజా హెగ్డే మాట్లాడుతూ.. రెండు పెద్ద బ్యానర్స్ మూవీస్ లో నటించనున్నానని, ఆ రెండు మూవీస్ సక్సెస్ తో బాలీవుడ్ లో టాప్ పొజిషన్ కు చేరుకొంటాననే ఆశాభావం వ్యక్తం చేశారు. ఇలా ఉండగా అల్లు అర్జున్ పక్కన హీరోయిన్ గా నటించిన అలా వైకుంఠపురం లో సినిమా జనవరి 12న రిలీజ్ కానుంది. ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే జనవరి నుండి ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో చేయబోతున్న కొత్త సినిమా షూటింగ్ లో పాల్గొన్నట్లు పూజా హెగ్డే తెలిపింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: