చాలా గ్యాప్ తరువాత నిఖిల్ మళ్లీ వెండితెర మీదకు రానున్నాడు. నిఖిల్ హీరోగా సుకుమార్ మరియు అల్లు అరవింద్ నిర్మాణ సంస్థలలో పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకుడిగా రాబోతున్న సినిమా అర్జున్ సురవరం. ఈ సినిమాతో నిఖిల్ మళ్లీ ఫామ్‌లోకి వస్తున్నాడు. ఒక  హీరో తో అనుకున్న సినిమా మరోహీరో తో ఫిక్స్ అవడం ఇండస్ట్రీలో చాలా కామన్. ఇప్పుడు అలాంటి సంఘటనే రాజ్ తరణ్ కు జరిగిందని సినీ వర్గాల సమాచారం.


ముందుగా అర్జున్ సురవరం సినిమాకి హీరోగా రాజ్ తరుణ్ అనుకున్నారట దర్శక నిర్మాతలు. కాని రాజ్‌తరుణ్ డేట్ విషయం ఫైనల్ చేయకపోనడంతో.. నిఖిల్ ని ఈ ఆఫర్ వరించిందట. అయితే ఈ  ప్రాజెక్ట్ చేదాటిపోవడం పట్ల రాజ్ తరుణ్ చాలా బాధగా ఉన్నాడట.  నిఖిల్ మాత్రం వెంటనే మరో హిట్ కొట్టి తనకు వచ్చిన గ్యాప్ ని తగ్గించుకోవాలనుకుంటున్నాడట. 


దిల్ రాజు నిర్మాతగా త్వరలో రాబోతున్న ఇద్దరి లోకం ఒకటే చిత్రంపై పూర్తి ఆశలు పెట్టుకున్న రాజ్ తరుణ్ వేరే ఆఫర్స్ ఒప్పుకునేందుకు తటపాయిస్తున్నాడట. గతంలోనూ తన దగ్గరకు వచ్చిన శతమానం భవతి, నేను లోకల్, ఎక్కడికి పోతావు చిన్న వాడ సినిమాలను రాజ్ తరణ్ వదేలేసుకున్నాడు. అవన్నీ మంచి హిట్స్ అయ్యాయి. అందుకే ఇప్పుడు ఆశలన్నీ  ఈసినిమాని పై పట్టుకున్నాడు రాజ్.


ఇప్పుడీ ప్రాజెక్టు కూడా  మంచి హిట్ అయ్యే కథ,కథనంతో రెడీ అయ్యిందని తెలుస్తోంది.  సుకుమార్ స్టోరీ, స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ చిత్రంలో నిఖిల్ రోల్ వెరీ ఇంట్రస్టింగ్ గా ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నిఖిల్ సరసన నటించే హీరోయిన్ ఎవరు ఏంటి అనేది ఇంకా క్లారిటీ లేదు. అలాగే ఈ సినిమాకు సంబంధించి మిగిలిన పూర్తి  వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: