అల్లు అరవింద్.. తెలుగు సినీరంగ దిగ్గజాల్లో ఒకరు. చిరంజీవి బావమరిదిగానే కాకుండా.. గీతా ఆర్ట్స్ ద్వారా తనకంటూ సొంత వ్యక్తిత్వం నిర్మించుకున్న నిర్మాత. ఆయన కుమారులు కూడా హీరోలు కావడం, మెగా ఫ్యామిలీ సినీరంగంలో విస్తరించడం ద్వారా ఆయన ప్రబలమైన శక్తిగా మారారు.

 

 

అయితే కొత్తను అందిపుచ్చుకోవడంలో ముందుండే అల్లు అరవింద్ ఇప్పుడు కొత్త తరం మీడియాపై దష్టి సారించినట్టు తెలుస్తోంది. మెజాన్‌ ప్రైమ్, నెట్‌ప్లిక్స్‌ లాగా కొత్త డిజిటల్‌ మాధ్యమాన్ని సినీ ప్రేక్షకులకు పరిచయం చేయటానికి అల్లు అర్జున్ కొన్నాళ్లుగా ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నాల్లో తలమునకలుగా ఉన్నారు. అందులో భాగంగానే ‘అర్జున్‌ సురవరం’ డిజిటల్‌ రైట్స్‌ని కూడా కొనుగోలు చేశారని టాక్ వినిపిస్తోంది.

 

అంతే కాదు.. ఇంకా కొన్ని మెగా హీరోల సినిమాలు కూడా ఈ వరుసలో ఉన్నట్టు సమాచారం. అంతర్జాతీయ డిజిటల్‌ సంస్థలకు పోటీగా, వాటి ప్రమాణాలకు ఏమాత్రం తీసిపోని విధంగా కొత్త డిజిటల్ మీడియా ఉంటుందట. మరికొన్ని మెగా కథానాయకుల సినిమాలు కొనుగోలు చేసి ఆ తర్వాత ఒక గ్రాండ్‌ ఈవెంట్‌ని ప్లాన్‌ చేసి అందులో ఈ డిజిటల్‌ మాధ్యమాన్ని పరిచయం చేస్తారని ఫిల్మ్‌నగర్‌ లో చెప్పుకుంటున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: