బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఈ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. దానికి కారణం రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం ట్రిపుల్ ఆర్ సినిమాలో హీరోయిన్ కావడమే. బాహుబలి లాంటి భారీ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న మరో భారీ ప్రాజెక్ట్ `ఆర్ఆర్ఆర్`. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అలాగే ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో తారక్కు జోడీగా ఒలీవియా మోరిస్ అనే విదేశీ అమ్మాయిని ఎంపిక చేసుకున్నారు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్ కనిపించనుంది.
తండ్రి మహేష్ భట్ దర్శక నిర్మాత కావడంతో చిన్ననాటి నుంచి కూడా సినిమాలపై ఆసక్తి పెంచుకుంది ఆలియా భట్. ఈ క్రమంలోనే మహేష్ భట్ వారసత్వంగా సినిమాల్లోకి వచ్చిన అలీయా.. తనదైన నటనతో ప్రేక్షకుల్నీ మెప్పిస్తున్నారు. 2012లో ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ తెరకెక్కించిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది ఆలియా. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో అమ్మడు ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ తర్వాత కూడా వరస విజయాలతో దూసుకుపోయింది ఆలియా. ఇది ఇలా ఉంటే.. అలీయా భట్ తన తండ్రి చేసిన పనికి షాక్కు గురైంది. వివరాల్లోకి వెళ్తే.. అలియా తండ్రి మహేష్ భట్ హిందీలో నిర్మాతగాను దర్శకుడిగాను పరిచయమే.
అయితే షాహిన్ భట్.. తనకు జరిగిన మెంటల్ ఇల్నెస్ గురించి ఓ పుస్తకం రాసింది. ఈ పుస్తక ఆవిష్కరణకు మహేష్ భట్తో పాటు తన కుటుంబం అంత హాజరైయారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు సహనం కోల్పోయిన భట్.. మీడియాపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా అలియా కలగజేసుకొని శాంతించాలంటూ సైగలు చేసిన వినిపించుకోని భట్ అలానే అరవడం చేశాడు. దీంతో అలీయాకు ఏం చేయాలో తెలియక కాస్త అన్ కంఫర్టబుల్గా ఫీల్ ఫీలైంది. ప్రస్తుతం ఈ వీడియా తెర వైరల్ అవుతుంది. ఇక ప్రస్తుతం ప్రస్తుతం ఆలియా ఆర్ ఆర్ ఆర్, బ్రహ్మాస్త్ర , సడక్ 2 సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలతో ప్రస్తుతం క్షణం తీరికలేకుండా గడిపేస్తుంది ఈ ముద్దుగుమ్మ.