ముద్దుల మావయ్య.. బాలయ్య-బోయపాటి శ్రీను కాంబినేషన్లో మరో సంచలనాత్మక మూవీ తెరకెక్కనుం ది. బాలయ్య ఈ మూవీలో డబుల్ రోల్ చేయనున్నట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. గతంలో `సింహా` `లెజెండ్` వంటి సూపర్ డూపర్ హిట్స్ అందించిన ఈ ద్వయం.. ఇప్పుడు కూడా అదే రేంజ్లో కొత్త లుక్, కొత్త కథనంలో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యారు. ఈ మూవీలోబాలయ్య డబుల్ రోల్ లో కనిపించనున్నట్టు తెలుస్తోంది. గ్రామీణ రైతుగా అదే సమయంలో కోట్లకు పడగలెత్తిన బిలియనీర్గా కూడా బాలయ్య కనిపించనున్నారు.
గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన సింహా, లెజెండ్లు అంచనాలను మించిన విషయం తెలిసిం దే. అనేక షేడ్స్లో బాలయ్య తన నట విశ్వరూపం చూపించారు. ఆ మూవీల్లోనూ బాలయ్య విభిన్న పాత్రల్లో అలరించారు. ఇక, ఇప్పుడు కూడా అదే తరహాలో మల్టిపుల్ రోల్స్ చేసేందుకు రెడీ అయ్యారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబందించిన సన్నాహాలు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి.
త్వరలోనే బాలయ్య విభిన్న గెటప్తో కనిపించనున్న రూరల్ విడుదలకు సిద్ధమైంది. ఇక గతంలోనూ బాలయ్య డబుల్ రోల్స్ మూవీలు చాలానే వచ్చాయి. అయితే, వాటికి భిన్నంగా బోయపాటి -బాలయ్య కాంబినేషన్ ఉంటుందని అంటున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే రైతు పాత్రలో బాలయ్య కనిపించనున్నారు. ఇప్పటికే నాగలి భుజంపై పెట్టుకుని, తలకి పాగా కట్టుకుని గ్రామీణ రైతు పాత్రలో ఒదిగిపోయిన బాలయ్య లుక్ అభిమానులకు గిలిగింతలు పెడుతోంది.
ఇక, బిలియనీర్గా కూడా బాలయ్య తనదైన శైలిలో విజృంభించడం ఖాయమని అంటున్నారు ప్లేబోయ్గా బాలయ్య తన విశ్వరూపం చూపిస్తారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. కాగా, వినయ విధేయ రామ ఫెయిల్యూర్ తర్వాత బోయపాటి తెరకెక్కిస్తున్న ఈ మూవీపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఇక ఈ నెలలోనే ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి.. వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయాలని చూస్తున్నారు. ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ బ్యానర్పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.