టాలీవుడ్ లోకి వర్షం మూవీతో ఇన్నాళ్లకు గుర్తొచ్చానా వానా అంటూ కుర్రాళ్లను గిలిగింతలు పెట్టిన నటి త్రిష తర్వాత తెలుగు, తమిళంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి నెంబర్ వన్ స్థాయికి ఎదిగింది.  అందాల పోటీలలో మిస్ చెన్నైగా ఎంపికై తర్వాత మిస్ ఇండియా అందాల పోటీలలో పాల్గొంది. మిస్ బ్యూటిఫుల్ స్మైల్ గా ఎంపికైంది. వర్షం, స్టాలిన్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా,పౌర్ణమి, బుజ్జిగాడు మేడిన్ చెన్నై, కృష్ణ సినిమాలు త్రిషకు తెలుగులో మంచి పేరు తెచ్చిపెట్టాయి.  2004 లో ప్రభాస్ సరసన వర్షం సినిమతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచింది.  ఈ మూవీకి ఉత్తమ నటిగా సౌత్ ఫిలిమ్ ఫేర్ అవార్డు దక్కించుకుంది.  తర్వాత ప్రభుదేవ దర్శకత్వంలో వచ్చిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా మరో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సినీ రంగంలోకి ప్రవేశించి ఇన్నేళ్లయినా ఏ మాత్రం గ్లామర్ చెక్కుచెదరకుంటా ఉంది.

 

గత కొంత కాలంగా త్రిష ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ పాత్రల్లో నటిస్తుంది. అందులోనూ హర్రర్ తరహా సినిమాల్లో ఎక్కువగా నటించింది. లవ్‌, సింటిమెంట్, రివెంజ్‌ పాత్రలే కాదు.. యాక్షన్‌ పాత్రలతోనూ తన నటనతో మెప్పించగలనంటూ ముందుకొస్తుంది.  తాజాగా హీరోయిన్ త్రిష తమిళంలో రాంగీ అనే లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటిస్తున్నది.  ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ కథ అందించగా.. ఎం శరవణన్ దర్శకుడు.. సి.సత్య మ్యూజిక్ అందిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శుభాస్కరన్ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.  

 

ఈ సినిమాలో  త్రిష పోలీస్‌ ఆఫీసర్‌ ప్రాత్రలో కనిపించనున్నట్లు టీజర్‌ చూస్తే అర్థమవుతోంది. ముఖ్యంగా ఇందులో త్రిష చేసిన యాక్షన్‌ సీన్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.  ఇప్పటి వరకు తన గ్లామర్ తో మత్తేక్కించిన ఈ బ్యూటీ ఇప్పుడు యాక్షన్ సీన్లతో ఇరగదీసిందంటున్నారు నెటిజన్లు. ప్రస్తుతం ఆమె గర్జన, 1818, పరమపదం విళైయాట్టు వంటి మూవీల్లో నటిస్తూ బిజిబిజీగా ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: