సూపర్ స్టార్ మహేష్ అనీల్ రావిపూడి కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా సరిలేరు నీకేవ్వరు. దిల్ రాజు, అనీల్ సుంకర కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజ్ చేస్తున్న ఈ సినిమా నుండి మొదటి సాంగ్ మైండ్ బ్లాంక్ ఆడియెన్స్ ను మెప్పించగా ఈరోజు సినిమా నుండి సెకండ్ సాంగ్ రిలీజ్ చేశారు. సూర్యుడివో చంద్రుడివో అంటూ వచ్చే ఈ సాంగ్ ను రామ జోగయ్య శాస్త్రి రచించగా బాలీవుడ్ సింగర్ ఫ్రాక్ పాడారు.

 

హిందీలో మ్యూజిక్ ప్రోగ్రామ్స్ కు జడ్జ్ గా వ్యవహరించే ఫ్రాక్ మొదటిసారిగా సౌత్ పాట పాడాడు. అది కూడా మహేష్ బాబు కోసం పాడటం విశేషం. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలోని ఈ సాంగ్ మేలోడీగా సాగుతుంది. అంతేకాదు సినిమాలోని థీమ్ చెప్పేలా ఈ పాత ఉంది. ముఖ్యంగా రామజోగయ్య శాస్త్రి సాహిత్యంకు మంచి మార్కులు పడ్డాయి. అయితే దేవి మ్యూజిక్ మాత్రం మరోసారి నిరాశపరచిందని చెప్పొచ్చు.

 

ఒక పక్క పోటీగా వచ్చే అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమా సాంగ్స్ తో రెచ్చిపోతుంటే సరిలేరు నీకెవ్వరు సాంగ్స్ మాత్రం ఆశించిన స్థాయిలో ఉండటం లేదన్నది పబ్లిక్ టాక్. సూర్యుడివో చంద్రుడివో సాంగ్ అసలు దేవి మార్క్ లేకుండా ఉందని చెప్పొచ్చు. సాంగ్ మేలోడీగా ఉన్నా దేవి మ్యూజిక్ మిస్సైందని చెప్పొచ్చు.

 

పటాస్ నుండి ఎఫ్2 వరకు వరుస హిట్లు అందుకున్న అనీల్ రావిపూడి ఈ సినిమాతో కూడా హిట్ కొట్టడం గ్యారెంటీ అంటున్నారు. సరిలేరు నీకెవ్వరు సినిమా మహేష్ కెరియర్ లో 26వ సినిమాగా వస్తుంది. భరత్ అనే నేను, మహర్షి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ అందుకున్న మహేష్ సరిలేరుతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: