టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్.ఆర్.ఆర్  సినిమా షూటింగ్ షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మా వచ్చే ఏడాది జూన్ 30 న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్లో ఉండగానే ఎన్టీఆర్ తన నెక్ట్స్ సినిమాలకు సంబంధించిన కథలు వినడం తో పాటు దర్శక, నిర్మాతలను కూడా ఖరారు చేసినట్టు ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది.

 

ఆర్ ఆర్‌ ఆర్ తర్వాత ఎన్టీఆర్ వరుసగా కొరటాల శివ, ప్రశాంత్ నీల్, అట్లీ దర్శకత్వంలో పని చేయటానికి రెడీ అవుతున్నాడట. ఎన్టీఆర్ కు ఇప్పటికే టెంపర్ సినిమా నుంచి అన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి. ప్రతి సినిమాకు ఎన్టీఆర్ మార్కెట్ బాగా పెరుగుతూ వస్తోంది. ఇక ఎన్టీఆర్ నెక్ట్స్ ప‌ని చేయాల‌నుకుంటోన్న ఈ ముగ్గురు ద‌ర్శ‌కులు  త‌మ సందేశాత్మ‌క క‌థ‌ల‌తో బాక్సాఫీస్ వ‌ద్ద  వంద‌ల కొట్లు కొల్ల‌గిట్టిన  విష‌యం తెలిసిందే.

 

ఆర్.ఆర్.ఆర్ సినిమా కోసం ఎన్టీఆర్ ఏకంగా ఏడాదిన్నర టైం కేటాయించాడు. ఈ సినిమా షూటింగ్ వేసవి నాటికి కంప్లీట్ అయితే అప్పటి నుంచి ఎన్టీఆర్ ఫ్రీ అవుతాడు. ఆ వెంటనే ఈ ముగ్గురు దర్శకుల్లో ఏదో ఒక దర్శకుడితో తన సినిమా ప‌ట్టాలెక్కించేందుకు ఎన్టీఆర్ పక్కా ప్లానింగ్‌తో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కొర‌టాల మెగాస్టార్ చిరంజీవి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ వచ్చే స‌మ్మ‌ర్‌కు కేజిఎఫ్ 2 సినిమా షూటింగ్ ఫినిష్ చేయనున్నాడు.

 

మ‌రి ఆ టైంకు చిరు - కొర‌టాల సినిమా షూటింగ్ ఫినిష్ అయితే కొర‌టాల‌తో ఎన్టీఆర్ క‌మిట్ అవుతాడా ?  లేదా ప్ర‌శాంత్ నీల్ సినిమా చేస్తాడా ? అన్న‌ది తేలాలి. వీరిద్ద‌రిలో ఎవ‌రో ఒక‌రితో సినిమా త‌ర్వాతే అట్లీ సినిమా ఉంటుంద‌ని టాక్‌..?

మరింత సమాచారం తెలుసుకోండి: