టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎంతో మంది స్టార్ హీరోల వారసులు వస్తున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో స్టార్ ప్రొడ్యూసర్ డి రామానాయుడు తనయుడు దగ్గుబాటి వెంకటేశ్ హీరోగా ‘కలియుగ పాండవులు’ మూవీతో పరిచయం అయ్యారు.  ఆయన సోదరుడు డి సురేష్ బాబు స్టార్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నారు.  డి సురేష్ బాబు తనయుడు దగ్గుబాటి రానా ‘లీడర్’ మూవీతో హీరోగా తెలుగు తెరకు పరిచయం అయ్యారు.  మొదటి సినిమా మంచి సక్సెస్ అయినా తర్వాత వరుసగా అపజయాలు పొందాయి.  అయితే హీరో గానే కాకుండా ఎలాంటి పాత్రకైనా న్యాయం చేయగల సత్తా రానా కి ఉంది. అందుకే భారత దేశ చరిత్రలో రికార్డుల మోత మోగించిన ‘బాహుబలి, బాహబలి2’మూవీస్ లో విలన్ గా నటించాడు రానా.  

 

తాజాగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి మరో వారసుడు పరిచయం కాబోతున్నాడు.. ప్రముఖ నిర్మాత డి. సురేష్‌ బాబు చిన్న కుమారుడు, విక్టరీ వెంకటేష్‌ అన్న కొడుకు, హీరో రానా తమ్ముడైన దగ్గుబాటి అభిరామ్ సిల్వర్ స్ర్కీన్‌ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైయ్యాడని ఫిల్మ్ నగర్‌లో చర్చ సాగుతోంది. ఆ మద్య శ్రీ రెడ్డి పుణ్యమా అని అప్పట్లో ఈయన పేరు ఇండస్ట్రీలో బాగా వినిపించింది. అప్పట్లో తనతో ఎఫైర్ నడిపించాడని శ్రీ రెడ్డి ఓ రేంజ్‌లో అభిరామ్‌తో ఆటాడేసుకుంది. ఇక ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఈయన పేరు మళ్లీ వినిపిస్తుంది. ఆ మధ్య రాజు మహరాజు దర్శకుడు భాను శంకర్ ఈయన కోసం కథ కూడా సిద్ధం చేసాడని.. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లోనే అభి లాంఛ్ అవుతాడని వార్తలు కూడా వచ్చాయి. కానీ ఆ సంగతి విషయం పై ఎలాంటి అప్ డేట్స్ లేకుండా పోయాయి.  

 

తాజాగా తమిళంలో ధనుష్ హీరోగా వచ్చిన అసురన్ సంచలన విజయం సాధించింది.. అసురన్‌లో ధనుష్‌ కుమారుడి పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ మూవీ తెలుగు లో వెంకటేష్ నటించబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో వెంకటేశ్  కొడుకుగా అభిరామ్ పరిచయం కానున్నాడనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ విషయంపై సురేశ్ బాబు క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా ద్వారా అభిరామ్ ను పరిచయం చేసే ఉద్దేశం లేదనీ, సోలో హీరోగానే అభిరామ్ ను పరిచయం చేయడం జరుగుతుందని చెప్పారు. అభిరామ్ నటనలో శిక్షణ తీసుకుంటున్నాడని.. తర్వలో హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమవుతున్నాడని తెలిసిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: