ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే.. తెలుగులో మొదలైన ఈ  బయోపిక్ ట్రెండ్ మెల్ల మెల్లగా అన్ని ఇండస్ట్రీలకు వ్యాపించింది. అలా ప్రస్తుతం ఈ ట్రెండ్ తమిళనాడులో ఎక్కువగా వినిపిస్తుంది. తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత గా జీవితం ఆధారంగా తలైవి, ఐరన్ లేడీ, క్వీన్ సినిమాలు తెరకెక్కుతున్నాయి. వీటిలో తలైవి, క్వీన్ సినిమాలకు సంబందించిన ఫస్ట్ లుక్ టీజర్లు ఇటీవల విడుదలై ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో మరో బయోపిక్ తెరకెక్కుతుందని సమాచారం. 

 

మొన్న మధ్య వచ్చిన బాలయ్య తెరకెక్కించిన ఎన్టీఆర్ బయోపిక్ గా కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు వచ్చాయి. కానీ, ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా నిలబలేక పోయాయి. అదే విదంగా వచ్చిన వైఎస్సార్ బయోపిక్  సినిమాలు బాగానే ప్రేక్షకుల నుండి మార్కులు సంపాదించింది. అయితే ఇప్పుడు టాలీవుడ్ స్టార్ మెగాస్టార్ చిరంజీవి బయోపిక్ తెరకెక్కుతోందని వార్తలు వినపడుతున్నాయి.. 


అయితే, ఈ బయోపిక్ లో చిరంజీవి పాత్రలో ఎవరు నటిస్తారా అన్న ఆలోచనలు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ మాత్రం నటించకూడదని చిరంజీవి ఇటీవల అన్నారు. మరి సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజలలో ఎవరో ఒకరు ఈ సినిమాలో నటిస్తారని గుసగుసలు వినపడుతున్నాయి. మొన్న ఆమధ్య ఓ సందర్భంలో వీరిద్దరిలో ఎవరొకరు నటిస్తే బాగుండునని చిరంజీవి కూడా అన్నారు. తేజు ఈ చిత్రంలోనటించబోతున్నారని వార్తలు వినపడుతున్నాయి. అయితే ఈ విషయం పై ఒక క్లారిటీ  వచ్చేవరుకూ ఆగాల్సిందే..

 

గతంలో ఓ సందర్భంలో చిరంజీవి ,మాట్లాడుతూ, తన బయోపిక్ లో రాంచరణ్ కనుక నటిస్తే, తనకు చరణ్ పుట్టిన సమయంలో అతడిని అతడే ఫ్యాన్స్ కు పరిచయం చేయడం బాగుండదని అభిప్రాయపడ్డారు. అలానే ఒక రకంగా బయోపిక్ లో సాయిధరమ్ నటిస్తే బాగుండునని ఆయన అభప్రాయపడ్డారు..మరి ఈ బయోపిక్ ను ఎవరు తెరకెక్కిస్తున్నారు. అనే విషయం కూడా తెలియాల్సి వుంది. ఈ బయోపిక్ కోసం కసత్తులు అప్పుడే చేస్తున్నారని సమాచారం... కాగా ఎప్పుడు మొదలవు తుంది అనే విషయం అధికారికగా ప్రకటన వెలువడే వరకు వెయిట్ చేయాల్సిందే..!!

మరింత సమాచారం తెలుసుకోండి: