ఈ కాలం హీరోల గొంతెమ్మ కోరికలకు ఏ నిర్మాతకు అయిన తీర్చడం భరించడం చాలా కష్టమవుతుంది. ఇన్ని రోజులు ఏ నిర్మాత కైనా హీరోయిన్లు కోరికల భయపడేవారు ఇప్పుడు అది హీరోల వంతు అవుతుంది. తాజాగా టాలీవుడ్ హీరో ఒకరు తన పర్సనల్ ఫారిన్ టూర్ కి  నిర్మాతని భరించమని చెప్పినట్టు తెలుస్తోంది. దాంతో అతనికి దాదాపు 20 లక్షల ఎక్కువ బడ్జెట్ అయ్యింది. ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో స్టార్ గా ఉన్న రజినీకాంత్ అల్లుడు ధనుష్ గురించి కూడా ఒక ఆసక్తికర వార్త బయటికి వచ్చింది.

 

 ఆయన ప్రస్తుతం నటిస్తున్న పటాస్ అనే చిత్రానికి సంబంధించి ఈ ఆరోపణ వస్తుంది. ఏ సినిమా షూటింగ్ స్పాట్లో ఆయనకు ఏర్పాటు చేసిన బస్సు నుంచి షూటింగ్ లొకేషన్ లోకి రావడానికి ఎంతో దూరం లేకపోయినా కూడా ఆయన కోసం నిర్మాత ఒక ఇన్నోవా కారుని ఏర్పాటు చేశారు.

 

కానీ తాను ఇన్నోవా కార్లో రాను అని కేవలం ఆడి కార్ అయితే తను షూటింగ్ చేస్తా అని తెగేసి చెప్పాడట. దీంతో ఏమీ చేయలేక నిర్మాత రోజు 20 ,000 రెంట్ తో దాదాపు 40 రోజుల పాటు కారును అద్దెకు తీసుకున్నారుట. దీని వల్ల అదనంగా అతనికి 10 లక్షలు నష్టం వచ్చినట్లు తెలుస్తోంది. స్వయంగా ఒక నిర్మాత అయిన ధనుష్ ఇలాంటి కోరికలు కోరడం నిజంగా విడ్డురం అనిపిస్తుంది.

 


ధనుష్ కథానాయకుడిగా ఆర్.ఎస్ దురై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో సత్య జ్యోతి ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో మెహ్రీన్ కథానాయిక కాగా అలనాటి తార స్నేహ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆడి కార్ కావాల్సిందేనంటూ ధనుష్ చేసిన యాగీపై యూనిట్ సభ్యుడే సోషల్ మీడియాలో లీక్ చేయడంతో నెటిజనుల్లో అది కాస్తా హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: