‘మహానటి’ మూవీతో దర్శకుడు నాగ్ అశ్విన్ పేరు మారుమ్రోగి పోయింది. ఆ తరువాత ఈ క్రియేటివ్ డైరెక్టర్ నుండి చాల మంచి సినిమాలు వస్తాయని చాలామంది ఆశించారు. ఒకానొక సమయంలో నాగ్ అశ్విన్ చిరంజీవితో ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ తరహాలో ఒక ఫ్యాంటసీ మూవీ చేయాలని చాలగట్టి ప్రయత్నాలు చేసినా చిరంజీవి నుండి పూర్తి సహాయ సహకారాలు లభించలేదు.

ఈనేపధ్యంలో ఈ క్రియేటివ్ దర్శకుడి పేరు ఒక బూతు వెబ్ సిరీస్ తో ముడిపెడుతూ వార్తలు బయటకు రావడం ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. వెబ్ శిరీష్ ప్రక్రియలో హిందీలో విపరీతంగా ప్రాచుర్యం పొందిన ‘లస్ట్ స్టోరీస్’ తెలుగు వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించే దర్శకుల లిస్టులో ఇప్పుడు నాగ్ అశ్విన్ పేరు కూడ వినపడటం షాకింగ్ గా మారింది. 

మానవతా విలువల గురించి తెలియచేసిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ లాంటి సినిమాను తీసిన నాగ్ అశ్విన్ ఒక బూతు వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించబోతున్నాడా అంటూ చాల మంది షాక్ అవుతున్నారు. నెట్ ఫ్లిక్స్ నిర్మాణం చేయబోతున్న ఈ బూతు వెబ్ సిరీస్ కు నందినీ రెడ్డి సంకల్ప రెడ్డి తరుణ్ భాస్కర్ లాంటి క్రియేటివ్ దర్శకులతో పాటు ఇప్పుడు నాగ్ అశ్విన్ పేరు కూడ చేరిపోవడం అత్యంత సంచలనంగా మారింది. 

వాస్తవానికి ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన ఒక భాగానికి దర్శకత్వం వహించడానికి ‘అర్జున్ రెడ్డి’ లాంటి సంచలనాలు సృష్టించిన సందీప్ వంగాను దర్శకుడుగా ఈ బూతు వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించమని కోరినా అతడు ఇలాంటి బూతు వెబ్ సిరీస్ ను చేయలేను అని చేతులు ఎత్తేయడంతో అతడి స్థానంలో నాగ్ అశ్విన్ వచ్చి చేరినట్లు సమాచారం. దీనితో తెలుగు ప్రేక్షకులలో ముఖ్యంగా యూత్ లో బూతు న్యూస్ ల పట్ల బూతు వెబ్ సిరీస్ ల పట్ల పెరిగిపోతున్న మోజును క్యాష్ చేసుకోవడానికి నెట్ ఫ్లిక్స్ లాంటి సంస్థలు ఎలా వ్యూత్మకంగా ప్రయత్నిస్తున్నాయో అర్ధం అవుతుంది. ఇలాంటి బూతు వాతావరణంలో నేటియువత ఎంత పతనం అవుతుందో తలుచుకుంటేనే చాల భయంగా మారింది..

 

మరింత సమాచారం తెలుసుకోండి: