వెంకటేష్ నాగ చైతన్య హీరోలు చేస్తున్న మల్టీ స్టారర్ సినిమా వెంకిమామ. ఈ సినిమా డిసెంబర్ 13 న రిలీజ్ కాబోతున్నది. సినిమా ఎలా ఉంటుందో ఏమో అనుకున్నారు. కానీ, సినిమా మాత్రం అదిరిపోయిందని టాక్ వస్తోంది. సినిమాకు ఈరోజే సెన్సార్ జరిగింది. యూ/ఏ సర్టిఫికెట్ సొంతం చేసుకున్న ఈ సినిమా గురించి సెన్సార్ సభ్యులు ఇచ్చిన రిపోర్ట్ ను చూస్తే షాక్ కావాల్సిందే.
సెన్సార్ సభ్యుల టాక్ ప్రకారం సినిమా సూపర్ గా ఉందని అంటున్నారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమాను చూడలేదని, ఇలాంటి కథతో వచ్చిన సినిమా సూపర్ గా ఉందని అంటున్నారు. వెంకటేష్ రైతు పాత్రతో అదరగొడితే.. చైతు జవాన్ గా అదిరిపోయేలా నటించాడని, మామ అల్లుళ్ళు సిల్వర్ స్క్రీన్ పై చేసిన హంగామా అంతాఇంతా కాదని అంటున్నారు. ఈ హంగామాతో థియేటర్లు మొత్తం దద్దరిల్లి పోతాయని అందులో సందేహం అవసరం లేదని అంటున్నారు.
పల్లెటూరి వాతావరణాన్ని చాలా ఫ్రెష్ గా చూపించినట్టు తెలుస్తోంది. దీంతో పాటుగా వెంకీమామ సినిమాలో వెంకటేష్ కు జోడిగా నటించిన పాయల్ తన నటనతో ఆకట్టుకున్నట్టుగా కూడా సమాచారం. ఆమెతో లవ్ లో పడే సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా ఉంటాయి. ఓ చక్కని కుటుంబకథా చిత్రంగా ఈ సినిమా ఉండబోతున్నది. కథ అనుకున్న దగ్గరి నుంచి ఎన్నో మార్పులు చేర్పులు చేసి... చివరకు సినిమాను ఓ అద్భుతమైన కథగా మార్చారు.
అనుకున్నట్టుగా సినిమా సూపర్ గా ఉందని సెన్సార్ నుంచి టాక్ రావడంతో సినిమాపై నమ్మకం ఏర్పడింది. సురేష్ ప్రొడక్షన్ సంస్థ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కించింది. ఇది సాహసం అని చెప్పాలి. ఇదిలా ఉంటె, సినిమాలో నాగ చైతన్యకు జోడిగా రాశి ఖన్నా నటించింది. ఒకవైపు గ్లామర్ తోను అలానే, నటనతోను ఆకట్టుకుంది రాశి ఖన్నా. పాయల్, రాశి ఖన్నాలు పోటీ పడి నటించారట. మొత్తానికి సినిమాకు పాజిటివ్ వైబ్ క్రియేట్ కావడంతో అంచనాలు పెరిగాయి.