'బాహుబలి' సినిమా దేశవ్యాప్తంగా తో పాటు అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ సెపరేట్ గుర్తింపు తెచ్చుకున్నాడు దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. ఒకానొక సమయంలో అంతర్జాతీయ స్థాయిలో భారతీయ చలన చిత్ర రంగం అంటే ప్రపంచ సినిమా ప్రేక్షకులకు గుర్తొచ్చేది బాలీవుడ్ ఇండస్ట్రీ పేరు. కానీ ప్రస్తుతం ప్రపంచ స్థాయిలో భారతీయ చలన చిత్ర రంగం అంటే గుర్తుకు వచ్చేది ఎస్ ఎస్ రాజమౌళి. ఇదిలా ఉండగా బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న 'RRR'. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ చాలా శరవేగంగా సాగుతోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో రెండు పెద్ద కుటుంబాలకు చెందిన వారసులు మెగా కుటుంబం నందమూరి కుటుంబానికి చెందిన జూనియర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మొట్టమొదటిసారి కలిసి నటిస్తున్న నేపథ్యంలో ఈ సినిమా దక్షిణాది సినిమా రంగంలోనే భారీ మల్టీస్టారర్ సినిమాగా పేరు తెచ్చుకుంది.

 

ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ దాదాపు 70 శాతం పూర్తయినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి. సినిమాలో రామ్ చరణ్ పక్కన హీరోయిన్ గా అలియా బట్ నటిస్తుండగా మరోపక్క జూనియర్ ఎన్టీఆర్ కి హీరోయిన్ గా విదేశీ అమ్మాయి ఒలీవియా నటిస్తోంది. కాగా రాజమౌళి సినిమాలు అంటే ఎక్కువ యాక్షన్ డోస్ కలిగిన సీన్లు సినిమా హాల్లో సినిమా సీట్లో కూర్చున్న ప్రేక్షకుడు రోమాలు నిక్కబొడుచుకునే లా సన్నివేశాలు చిత్రీకరిస్తూ తన సినిమా చూసే ప్రేక్షకుడికి రక్తి కట్టించే విధంగా సినిమాలు తెరకెక్కించే రాజమౌళి...ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్ rrr గతానికి భిన్నంగా సినిమాలు యాక్షన్ సన్నివేశాలతో పాటు అదిరిపోయే రేంజ్ లో రొమాన్స్ సన్నివేశాలు కూడా ఉండేలా రాజమౌళి జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి.

 

ఈ నేపథ్యంలో రామ్ చరణ్... అలియాపై ఇప్పటికే ఓ రొమాంటిక్ సాంగ్ ను షూట్ చేశారని సమాచారం. మరియు అదే విధంగా ఎన్టీఆర్ - ఒలీవియా మధ్య కూడా అదిరిపోయే రొమాంటిక్ సీన్స్ ఇటీవల రాజమౌళి చిత్రీకరించినట్లు ఫిలింనగర్ లో వార్తలు వినపడుతున్నాయి. దీంతో ఈ వార్త బయటకు రావడంతో సినిమాపై రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: