టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఇటీవల జరిగాయి. ఈ వేడుకలకు ఇండస్ట్రీ నుండి చాలా మంది ప్రముఖులు హాజరు కావడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి నందమూరి బాలకృష్ణ ఇంకా చాలా మంది సినిమా హీరోలు నిర్మాత సి.కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలకు హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ గతంలో టాలీవుడ్ ఇండస్ట్రీ దివంగత స్వర్గస్తులైన దాసరి నారాయణరావు పెద్దగా ఉండే వారిని ఆ పెద్ద దిక్కును ఇప్పుడు ఇండస్ట్రీ కోల్పోయిందని పేర్కొనటం జరిగింది. దాసరి నారాయణరావు ఇండస్ట్రీలో ఉన్నంతకాలం ఎటువంటి సమస్య వచ్చినా ఆయన ముందుండి పరిష్కరించే వారిని ప్రతి ఒక్కరిని సమన్వయంతో కలుపుకుంటూ పోయే వాళ్ళని సమస్యల విషయంలో అందరి అభిప్రాయాలను తీసుకుని సమస్య పరిష్కరించే వారిని ప్రస్తుతం ఇండస్ట్రీలో మా అసోసియేషన్ లో చిన్న చిన్న సమస్యలకే ఎటువంటి పరిస్థితుల్లో దారితీస్తున్నాయి వంటి విషయాలు చూస్తుంటే చాలా బాధాకరంగా ఉందని దాసరి నారాయణరావు ఉంటే అటువంటి సమస్యలు చిటికలో తీర్చే వారని నిర్మాత సి.కళ్యాణ్ పేర్కొన్నారు.

 

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక సమస్యలు ఉన్నాయని మరి వీటన్నింటికి తక్షణ పరిష్కారం ఏంటి?  వాటిని తీర్చే వ్యక్తి ఎవరు? అంటే మెగాస్టార్ చిరంజీవి ఒక్కరే వాటికి న్యాయం చేయగలరని సి.కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని చిరంజీవికి తాను వివరించానని తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ` కింద స్థాయి నుంచి వచ్చిన నటుడాయన కష్టం సమస్యల గురించి తెలిసిన వ్యక్తి. చిరంజీవి మాటంటే అందరికీ ఓ గౌరవం.

 

దాసరి గారిలానే ఆయన కూడా చిన్న సినిమాలకు ఎంతగానో ప్రోత్సహిస్తారు. ఆయన మాట్లాడే విధానం మరియు నడిచే నడవడిక ఎదుటి వారికి ఇచ్చే గౌరవం బట్టి చూస్తే చిరంజీవి .. దాసరి లోటును చేర్చాలని ఆయన ఇండస్ట్రీ పెద్దగా ఉంటే బాగుంటుంది అని నిర్మాత సి.కళ్యాణ్ పేర్కొన్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: