యువరత్న, నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న తాజా సినిమా రూలర్. కోలీవుడ్ దర్శకుడు కె.ఎస్ రవికుమార్ దర్శకత్వంలో హ్యాపీ మూవీస్ పతాకంపై సీనియర్ నిర్మాత సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే టీజర్లు, ట్రైలర్లతో దుమ్మురేపుతోంది. ట్రైలర్ ఇప్పటికే బాలయ్య అభిమానులకు పూనకాలు ఇస్తోంది. ఇక ఈ సినిమా నుంచి మరో అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు సినిమా యూనిట్.
సినిమాలోని మరో సాంగ్ రిలీజ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. రేపు (బుధవారం) సాయంత్రం 05:05 నిమిషాలకు ‘పడ్తాడు తాడు..’ అనే లిరికల్ వీడియో విడుదల చేయనున్నారట. ఈ విషయాన్ని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సాంగ్ బాలయ్య - హీరోయిన్ సోనాల్ చౌహాన్ మధ్య వచ్చే కమర్షియల్ డ్యూయట్ సాంగ్ అని సమాచారం. ఈ సాంగ్లో బాలయ్య వేసే స్టెప్పులు ఓ రేంజ్లో ఉంటాయట. జై సింహా సినిమాలో అమ్మ కుట్టి అమ్మ కుట్టి పాటకు బాలయ్య కుర్రాడిలా స్టెప్పులు వేసి ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు.
ఇప్పటికే విడుదలైన ‘అడుగడుగో యాక్షన్ హీరో..’ సాంగ్ మంచి రెస్పాన్స్ అందుకుంది. రూలర్ ట్రైలర్ కూడా యూట్యూబ్ ట్రెండింగ్ లో టాప్ -5లో కొనసాగుతుంది. ఇక రేపు రెండో సాంగ్ కూడా వచ్చి ప్రేక్షకులకు ఎక్కితే రూలర్ సినిమాపై అంచనాలు డబుల్ అవుతాయనడంలో సందేహం లేదు. ఈ సినిమాలో రెండో హీరోయిన్గా వేదిక నటిస్తోంది. వేదిక పాత్రకు కూడా సినిమాలో మంచి ప్రయార్టీ ఉంటుందట.
క్రిస్మస్ కానుకగా రూలర్ ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వడంతో బాలయ్య .. బోయపాటితో చేసే సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఈ సినిమా జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. బాలయ్య డబుల్ రోల్ చేస్తోన్న ఈ సినిమా లో ఓ రోల్లో బాలయ్య రైతుగాను, మరో రోల్లో బిలియనీర్గా కనిపించనున్నాడు. ఈ సినిమాలో బాలయ్య సరసన నటించే హీరోయిన్ల కోసం బోయపాటి వేటలో ఉన్నాడు.