నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో బాగా గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు మరో సినిమాలో నటిస్తున్నారు ఆ సినిమా కోసం బన్నీ బాగా కష్టపడి బరువును కూడా తగ్గించాడని తెలుస్తోంది.. అయితే ఇప్పుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.. దాదాపు చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది..


క్రేజీ కాంబోలో వస్తున్నా సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలను పెట్టుకుంటుంది.. ఇకపోతే బన్నీ సినిమా వచ్చి చాలా కాలం కావడంతో ఈ సినిమాపై అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.సంక్రాంతి కానుకగా వస్తోన్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల జోరు పెంచారు. ప్రమోషన్స్‌లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా జరపడానికి ప్లాన్ చేస్తున్నారు. 


కాగా, ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా జూనియర్ ఎన్టీఆర్ హాజరవుతున్నారు అని వార్త ఇండస్ట్రీలో హాల్ చల్ చేస్తుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఇప్పటికే ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా చేశారు. వీళ్లిద్దరి మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. మరోవైపు.. అల్లు అర్జున్, ఎన్టీఆర్ మధ్య బావ అని పిలుచుకునేంత చనువు ఉంది. ఈ చిత్ర యూనిట్‌తో ఎన్టీఆర్‌కు ఉన్న ఈ అనుబంధంతోనే ఆయన్ను ‘అల వైకుంఠపురములో’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా హాజరుకావాలని అడిగారట. దానికి ఎన్టీఆర్ అంగీకరించారనే వార్తలు గుప్పుమంటున్నాయి..


ఇది ఇలా ఉండగా.. మహేష్ బాబు సరిలేరు నికెవ్వరూ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిగా వస్తున్నారన్న వార్తలు వినపడుతున్నాయి.మహేష్, రామ్ చరణ్ లు మంచి స్నేహితులు కావడంతో ఆ ఈవెంట్ కు చరణ్ వస్తారని అర్థమవుతుంది.. ఈ వార్త కనుక నిజమైతే ఇంకా రచ్చ రంబొలే అంటూ వీరు అభిమానులు ఖుషి అవుతున్నారు..అల్లు అర్జున్, మహేష్ బాబు సినిమాలు సంక్రాంతికి విడుదల కాబోతుంది.. జనవరి 11న మహేష్ సినిమా , 12న బన్నీ సినిమా థియేటర్లలో చేయబోతున్న సంగతి తెలిసిందే.. మరి ఈ సినిమాలలో మాత్రం ఈ సినిమా హిట్ అవుతుంది అన్న తెలియాల్సి ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి: