తెలుగు లో హీరో రామ్ నటించిన ‘నేను శైలజ’ మూవీతో తెలుగు తెరకు పరిచయం అయిన మాలీవుడ్ బ్యూటీ కీర్తి సురేష్.  ఆ తర్వాత నేచురల్ స్టార్ నటించిన ‘నేను లోకల్’ సూపర్ హిట్ తో తెలుగు ప్రేక్షకుల  మనసు దోచింది.  ఆ వెంటనే అలనాటి అందాల తార సినీ జగత్తులో ఒక్క మెరుపులా మెరిసిన మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా ‘మహానటి’ మూవీలో నటించింది కీర్తి సురేష్.  అచ్చం సావిత్రి వచ్చి మనముందు నటించిందా అన్నంతగా నటించి విమర్శకుల నుంచి ప్రశంసలు పొందింది.   ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ లో బిజీగా మారిపోయింది. తనకు ఎంతో అభిమాన నటుడు అయిన రజినీకాంత్ 168 సినిమాలో నటించే ఛాన్స్ కూడా కోట్టేసింది.

 

 సినీ పరిశ్రమలో ఇంత త్వరగా అదృష్టం కలిసి రావడం అంటే నిజంగా కీర్తి సరేష్ దే అని చెప్పొచ్చు.  ప్రస్తుతం కీర్తి సురేష్ మిస్ ఇండియా, పెంగ్విన్ లాంటి పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఇటీవలే నాగార్జున “మన్మథుడు-2” చిత్రంలో ఓ చిన్న పాత్రలో మెరిసింది ఈ బ్యూటీ. కానీ ఈ మూవీ పెద్దగా సక్సెస్ కాలేదు. “మహానటి”తో జాతీయ ఉత్తమ నటిగా నిలిచిన కీర్తి సురేష్. కాగా,  ఆమె నటిస్తున్న సినిమాల జాబితాలో మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న `పొన్నియ‌న్ సెల్వ‌న్‌` మూవీ కూడా ఉంది. అయితే లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఈ సినిమా నుండి కీర్తి సురేశ్ త‌ప్పుకున్న‌ట్లు స‌మాచారం.  వాస్తవానికి సిని పరిశ్రమలో ఎవరైనా మణిరత్నంతో ఒక్క సినిమా తీస్తే చాలు అనుకునే వారు ఎంతో మంది ఉన్నారు.  ఆయనకు ఉన్న క్రేజ్ అలాంటిది.  అయితే ఇటీవల కాలంలో మణిరత్నం మూవీస్ కాస్త వెనుక బడుతున్న విషయం తెలిసిందే.  

 

తాజాగా కీర్తి సురేష్ ఆయన ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకోవ‌డానికి ప్ర‌త్యేక కార‌ణ‌మంటూ ఏదీ లేద‌ని, డేట్స్ అడ్జ‌స్ట్ చేయ‌లేక‌పోవ‌డ‌మేన‌ని కోలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. కీర్తిసురేశ్ స్థానంలో త్రిష న‌టించ‌నుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఈ చిత్రం దాదాపు 800 కోట్ల బ‌డ్జెట్‌తో రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని రూపొందించ‌నున్న‌ట్టు స‌మాచారం. క‌ల్కీ రాసిన పొన్నియ‌న్ సెల్వ‌న్ అనే చారిత్ర‌క న‌వ‌ల ఆధారంగా తెర‌కెక్క‌నున్నట్లు సమాచారం.   ఏఆర్ రెహ‌మాన్ మూవీకి సంగీతం అందిస్తుండ‌గా… మద్రాస్ టాకీస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ చారిత్రాత్మ‌క మూవీలో జయం రవి, విక్రమ్, అనుష్క, విజయ్ సేతుపతి, మోహ‌న్ బాబు, ఐశ్వ‌ర్య‌రాయ్, అమితాబ్ బ‌చ్చ‌న్ వంటి ప‌లువురు స్టార్స్ న‌టిస్తున్న‌ట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: