సూపర్ స్టార్ రజినీ కాంత్, స్టార్ డైరెక్టర్  ఏఆర్ మురగదాస్  కాంబినేషన్ లో  తెరకెక్కుతున్న చిత్రం 'దర్బార్'. ఇటీవలే ఈచిత్రం షూటింగ్  చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యకమాలను  జరుపుకుంటుంది. ఈ చిత్రంలో  రజినీ  ఆదిత్య అరుణాచలం పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.  ఇక  రేపు  తన 69వ పుట్టినరోజును జరుపుకోనున్నారు రజినీకాంత్.  ఈసందర్భంగా  దర్బార్  ట్రైలర్ ను రేపు విడుదలచేయనున్నారని కోలీవుడ్ మీడియా  వెల్లడించింది. అయితే మేకర్స్ నుండి  మాత్రం ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలుబడలేదు. 
 
 
యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో  నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా యంగ్ హీరోయిన్  నివేద థామస్ రజినీకి కూతరుగా కనిపించనుంది.  ఇక వీరితోపాటు బాలీవుడ్ ప్రముఖ నటులు సునీల్ శెట్టి , ప్రతీక్ బబ్బర్ , దిలీప్ తాహిల్ , జతిన్ సర్ణ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.  అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది.  మురగదాస్ - రజినీ కాంబినేషన్ లో వస్తున్న మొదటి చిత్రం కావడంతో  దర్బార్  పై భారీ అంచనాలు వున్నాయి. ఈ చిత్రాన్ని  ఓవర్సీస్ లో  ఫార్స్ ఫిలిమ్స్  విడుదలచేస్తుంది. ఇందుకోసం ఆ సంస్థ ఏకంగా  38కోట్లకు ఆహక్కులను సొంతం చేసుకుంది. ఇక   దర్బార్  తెలుగు వెర్షన్  థియేట్రికల్ హక్కులను  ఎన్వీ ప్రసాద్ దక్కించుకున్నాడు.  ఈచిత్రం  వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలకానుంది.
 
ఇక ప్రస్తుతం  రజినీకాంత్శివ డైరెక్షన్ లో  తన 168 వ చిత్రంలో నటించడానికి  రెడీ అవుతున్నాడు. ఈరోజు ఈ చిత్రం లాంచ్ అయ్యింది.  మీనా , కుష్బూ , కీర్తి సురేష్  , ప్రకాష్ రాజ్  వంటి  భారీ క్యాస్టింగ్ తో   తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని  సన్ పిక్చర్స్ నిర్మించనుంది. ఇమ్మాన్ సంగీతం అందించనున్నాడు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: