నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.   సౌత్ లో ఆమె ఓ స్టార్ హీరోయిన్.  స్టార్ హీరోయిన్ అని చెప్పడం కంటే కూడా ఆమె స్టార్ హీరో అని కూడా చెప్పొచ్చు.  ఎందుకంటే, సౌత్ లో ఓ స్టార్ హీరోకు ఎలాంటి ఫాలోయింగ్ ఉంటుందో అంతటి ఫాలోయింగ్ ఉంటుంది నయన్ కు. అంతేకాదు, నయన్ చేస్తున్న సినిమాలు కూడా అదే రేంజ్ లో ఉంటాయి.  


ఇక ఇదిలా ఉంటె, నయనతార  సినిమా చేసిన తరువాత ఆ సినిమా ప్రమోషన్లో కనిపించడం కానీ, సినిమా ఆడియో, ప్రీ రిలీజ్ వేడుకలకు రావడం కానీ చేయదు.  ఇది తన సినిమా లో నటించి పక్కకు తప్పుకుంటుంది.  ఆ సినిమా గురించి ఎలాంటి కామెంట్స్ చేయదు.  ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వదు.  మెగాస్టార్ సైరా సినిమా ప్రమోషన్స్ కూడా ఆమె హాజరు కాలేదు.  


కానీ, నయన్ కు ఉన్న క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు.  ప్రస్తుతం రజినీకాంత్ దర్బార్ సినిమా చేస్తున్నది.  ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 9 న రిలీజ్ కాబోతున్నది.  ఇదిలా ఉంటె, నయనతార రాజకీయాల్లోకి  వస్తోందని ప్రచారం జరుగుతున్నది.   నయనతార ఇటీవలే కన్యాకుమారిలోని తీరు చెందూర్ ఆలయనానికి వెళ్ళింది.  నయన్ తో  పాటుగా ఆమె ప్రేమికుడు విఘ్నేష్ శివన్ కూడా ఉన్నాడు.  


కాగా, ఆ ఆలయంలో మాజీ బీజేపీ ఎంపీ నరసింహన్ కూడా వెళ్లారు.  అనుకోకుండా కనిపించిన నయన్ తో కాసేపు మాట్లాడారు.  ఈ సందర్భంగా ఆమె హైదరాబాద్ ఎన్ కౌంటర్ గురించి అడిగినట్టు మాజీ ఎంపీ తెలిపారు.  బీజేపీ ప్రభుత్వం చట్టాలను కఠినం చేస్తోందని, అందులో సందేహం అవసరం లేదని అన్నారు. ,అయితే, నయన్ ను రాజకీయాల్లోకి  రావాలని బీజేపీలో  చేరితే బాగుంటుందని అన్నారట.  దీనికి నయన్  చిరునవ్వి నవ్వి   సైలెంట్ గా ఉన్నట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: