ఎన్నో వివాదాల నడుమ సెన్సార్ బోర్డు నుండి గ్రీన్ సిగ్నల్ లభించటంతో ఈరోజు అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా విడుదలైంది. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సిద్దార్థ తాతోలు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. దాదాపు 1200 థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి హిట్ టాక్ వస్తోంది. ప్రేక్షకులు రామ్ గోపాల్ వర్మ చాలా కాలం తరువాత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 
 
ప్రేక్షకులు అమ్మరాజ్యంలో కడప బిడ్డలు సినిమా గురించి స్పందిస్తూ సినిమా చాలా బాగుందని అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా అని ఆర్జీవీ అద్భుతంగా ఈ సినిమా తెరకెక్కించాడని అన్నీ నిజాలే ఉన్నాయని చెబుతున్నారు. కళ్లకు కట్టినట్లు రామ్ గోపాల్ వర్మ సినిమాలో అన్ని పాత్రలను చూపించాడని చెబుతున్నారు. ఆర్జీవీ గట్స్ ఉన్న డైరెక్టర్ అని బాబును నెగటివ్ గా చూపించారని చెప్పారు. 
 
బాబు రోల్ లో నటించిన వ్యక్తి అద్భుతంగా నటించాడని అన్నారు. మూవీ చాలా బాగుందని రామ్ గోపాల్ వర్మ ఏదైనా ఓపెన్ గా చెబుతారని అన్నారు. క్లైమాక్స్ అద్భుతంగా ఉందని క్యారెక్టర్లన్నింటినీ బాగా చూపించాడని అన్నారు. సినిమా మాత్రం కొంచెం నిదానంగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆర్జీవీ బాబు నెగటివ్, పాజిటివ్ రెండూ చూపించాడని వెన్నుపోటును బాగా చూపించాడని అన్నారు. 
 
సినిమాలో కామెడీ మాత్రం ఒక రేంజ్ లో ఉందని చెబుతున్నారు. బాబు ఫ్యాన్స్ ఈ సినిమాకు దయచేసి రావద్దని కొందరు అభిప్రాయపడుతున్నారు. దమ్మున్న 'డైరెక్టర్ ఆర్జీవీ అని సినిమాను పచ్చిగా చూపించాడని అన్నారు. బాబును ఇందులో విలన్ గా చూపించారని అన్నారు. ఈ సినిమా బయోపిక్స్ తో పోలిస్తే చాలా బాగుందని అన్నారు. ఆర్జీవీ ఈజ్ బ్యాక్ అని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. 
 

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: