30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటే గుర్తుకు వచ్చేది ప్రతి ఒక్క తెలుగు వాడికి కమెడియన్ పృథ్వి. సినిమాల్లో పలు కామెడీ పాత్రలు చేస్తూ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో కడుపుబ్బా నవ్వించి ఇండస్ట్రీలో తనకంటూ సపరేట్ క్రేజ్ క్రియేట్ చేసుకుని వైయస్సార్ పై అభిమానంతో వైసీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ సందర్భంలో పార్టీలో కీలకంగా ఉంటూ జగన్ ఎలాంటి కార్యక్రమం పెట్టిన దానిలో తనవంతుగా చురుగ్గా పాల్గొని కార్యకర్తలు ఉత్సాహపరుస్తూ జగన్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో వైసీపీ జెండా ని మోసి పార్టీ కష్టకాలంలో కూడా ఎక్కడా కూడా అభిమానం తగ్గిపోకుండా నిత్యం జగన్ వెంటే నడుస్తూ ముఖ్యంగా జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్రలో జగన్ అడుగులో అడుగు వేస్తూ కీలక సమయాల్లో కూడా పార్టీలో 30 ఇయర్స్ పృద్విరాజ్ రాణించడం జరిగింది.

 

కాగా 2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీ భారీ మెజార్టీతో అధికారంలోకి రావడంతో జగన్ ముఖ్యమంత్రి కావడం తో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి కి టీటీడీ బోర్డు ఆధ్వర్యంలో నడిచే శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్ కి చైర్మన్ అయిన తర్వాత పాపులరైన పృథ్వి కి కొత్త కష్టాలతో ముప్పు తిప్పలు పడుతున్నాడు. దేవుడి సన్నిధిలో పని చేసే ఛాన్స్ వచ్చిందని ఎస్వీబీసీ ఛానల్ కి చైర్మన్ పదవిని చాలా సంతోషంగా తీసుకున్న 30 ఇయర్స్ కమెడియన్ పృథ్వి కి రోజు దినదినగండంగా గడుస్తుందని వార్తలు వినబడుతున్నాయి. అయితే ఈ తిప్పలు సినిమా రంగంలో ఉన్నప్పుడు కూడా అంతగా లేవని 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి ఫీల్ అవుతున్నాడు. విషయంలోకి వెళితే శ్రీవారి దర్శనం కోసం ఒకవైపు రాజకీయ నాయకుల నుండి మరొక వైపు సినిమా రంగం నుండి రోజు ఫోన్ల మీద ఫోన్లు రావడం తో పాటుగా నేను సీఎం బంధువుని ఆయన దూరపు చుట్టాన్ని అంటూ ఇలాగా అనేకమంది 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి కలుస్తూ తమకి దర్శనం కల్పించాలని అనేక రకాలుగా చాలామంది ఇబ్బందులకు గురి చేస్తూ 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి కి చుక్కలు చూపిస్తున్నారట.

 

అయితే ఈ మధ్య ఒక వ్యక్తి అజ్ఞాత వ్యక్తి నేను సీఎం బంధువుని టీటీడీ బోర్డు లో పదవి ఇప్పించాలని పృధ్విని కోరటం జరిగిందట...అంతేకాకుండా తెగ గొడవ పెట్టుకునే విధంగా సదరు వ్యక్తి వ్యవహరించడంతో  అజ్ఞాత వ్యక్తి ని తీసుకుని సీసీ కెమెరా ఉన్న గదిలో అతనికి తెలియకుండా కమెడియన్ పృథ్వి మాట్లాడించడం జరిగిందట. తర్వాత ఆ వీడియో క్లిప్ ని సీఎం జగన్ కి సంబంధించిన సన్నిహితులకు చూపించిన తర్వాత ఆ వ్యక్తి ఎవరో తమకు తెలియదని...జగన్ కి బంధువు కూడా కాదని చెప్పడంతో పృద్వి షాక్ కు గురయ్యారట. ఇలానే రోజు చాలామంది వీఐపీలు అంటూ మాకు వాళ్ళు తెలిసి ఈ మినిస్టర్ తెలుసు అంటూ తెగ ఇబ్బందులకు గురి చేస్తున్న క్రమంలో తనతో కలిసి మాట్లాడాలని వస్తున్న ప్రతి అజ్ఞాత వ్యక్తి ని సీసీ కెమెరాలు ఉన్న గదిలోకి తీసుకెళ్లి ఎందుకైనా మంచిదని పృద్వి మాట్లాడుతున్నారు అంట. మొత్తం మీద శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కి చైర్మన్ పదవి కన్నా సినిమా నటుడిగా చాలా హాయిగా ఉందని 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి ప్రస్తుతం ఫీల్ అవుతున్నాడు అని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: