ప్రస్తుత రాజకీయాల్లో నీతి మంతులు, నైతికత పాటించే వారు దుర్బిణి పెట్టి వెదికినా కనిపించరు. ఇప్పుడున్న రోజుల్లో రాజకీయ పార్టీల పరిస్థితి గొంగట్లో కూర్చొని అన్నం తింటూ వెంట్రు కలను ఏరిన చందంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో అవినీతి మరక అంటని ఒక్క పార్టీ కూడా చుద్దామంటే కనిపించదు. ఇదిగో ఇలాంటి విషయాలను వర్మ చాలా త్వరగా క్యాచ్ చేస్తాడు. తాను సినిమా తీయడానికి కధలు దొరకడం లేదని ఏనాడు చెప్పలేదు. తనకు తోచిన కధను తాను నచ్చిన విధంగా తీసుకుంటూ వెళ్లుతున్నాడు.

 

 

ఆయన సిద్దాంతం ఎవరికి సినిమా నచ్చిన నచ్చకపోయినా తాను మాత్రం సినిమా తీయాలని గట్టిగా నిర్ణయించుకుంటే మాత్రం ఎన్ని అడ్డంకులు వచ్చినా అనుకున్నది చేసి తీరుతాడు వర్మ అందుకే అందరిలో ఆయనను ప్రత్యేకంగా నిలిపింది ఆయన వ్యక్తిత్వమే. ఇకపోతే అమ్మ రాజ్యంలో – క‌డ‌ప బిడ్డ‌లు అంటూ ఓ సినిమాను తీసి జనాలమీదికి వదిలాడు వర్మ. ఈ సినిమా రిలీజ్ కావడానికి ముందు ఈ చిత్రయునిట్‌కు మరో సినిమా కనిపించిందట. అడుగడుగున ఈ చిత్రానికి అన్ని అడ్డంకులే ఇదే కాకుండా గతంలో వచ్చిన లక్ష్మీస్ ఎన్టీఆర్,  

 

 

ఇప్పుడు అమ్మరాజ్యంలో కడప బిడ్డలు మూవీ ఆపడానికి ఎంతో మంది ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నాలు వర్మ సినిమాను ఆపలేకపోయాయి. కాని వర్మకు మరో కొత్త కధను స్పూరించేలా చేశాయట.. ఎవరెవరైతే వర్మ సినిమా రిలీజ్ కాకుండా ఆపి ఇబ్బందులకు గురి చేశారో వారందరి పైన ఇప్పుడు వాళ్లపై సరికొత్త మూవీ తీస్తానని ఆయన ప్రకటించాడు.. అమ్మ రాజ్యంలో – క‌డ‌ప బిడ్డ‌లు చిత్రం ఈ రోజు విడుదలైంది.

 

 

అస‌లు ఈ సినిమా బ‌య‌ట‌కువస్తుందా, రాదా?  అనే డౌట్ల మ‌ధ్య రిలీజ్‌కి నోచుకోవ‌డం గొప్ప విశేష‌మే. ఈ సినిమాని ఆపాల‌ని చాలా మంది చూశార‌ట‌. త‌న వెనుకే కుట్ర‌లు చేస్తూ. గోతులు కూడా తీశార‌ట‌. వాళ్లంద‌రి ప‌నీ త్వ‌ర‌లోనే ప‌డ‌తా అంటున్నాడు వర్మ . ఈ సినిమాని ఆప‌డానికి ఎవ‌రెవ‌రు ప్ర‌య‌త్నించారో, వాళ్లంద‌రిపైనా కేసులు బ‌నాయిస్తా నంటున్నాడు. వ‌ర్మ అవ‌న్నీ చేస్తాడో లేదో తెలీదు గానీ, త‌న సినిమా ఆప‌డానికి చేసే ప్ర‌క్రియ మొత్తం ఓ సినిమా తీస్తాడు. అది మాత్రం గ్యారెంటీ అనుకుంటున్నారు సినీ జనం..

మరింత సమాచారం తెలుసుకోండి: