పింక్ తెలుగు రీమేక్ గురించి అంతటా ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతోనే పవన్ కల్యాణ్ రీఎంట్రీ ఇస్తున్నారని అభిమానుల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. పింక్ ఒరిజినల్ నిర్మాత బోనీకపూర్ దిల్ రాజుతో భాగస్వామిగా కొనసాగనున్నారు. వేణు శ్రీరామ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ గురువారం దిల్ రాజు కార్యాలయంలో రికార్డింగ్ కార్యక్రమాలతో సినిమా ప్రారంభమైంది. బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ చేసిన పాత్రను తమిళంలో అజిత్ పోషించాడు. కోలీవుడ్ లో కూడా ఈ సినిమా విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు వాళ్ళిద్దరిని డామినేట్ చేసే విధంగా పవన్ ఈ సినిమాకొసం సిద్దమవుతున్నాడు. 

 

ఇక ఈ సినిమాలో కథానాయికలు ఎవరు? అని ఇన్నాళ్ళు ఇండస్ట్రీలో టాక్ నడిచింది. బాలీవుడ్ లో తాప్సీ ప్రేక్షకులను తన నటనతో బాగా ఆకట్టుకుంది. ఒక రకంగా చెప్పాలంటే ఆ సినిమాతోనే తాప్సీ కి బాలీవుడ్ లో వరుసగా అవకాశాలు రావడం ప్రారంభించాయి. ఇక తెలుగులో నటించే హీరోయిన్స్ ముగ్గురి పేర్లు ప్రస్తుతం ఫిలింసర్కిల్స్ లో వైరల్ గా వినిపిస్తున్నాయి. మలయాళ ముద్దుగుమ్మ నివేద థామస్.. తెలుగమ్మాయి అంజలి ఈ సినిమాలో కీలక పాత్రలకు ఓకే అయ్యారట. ఇక ఇందులో మెయిన్ లీడ్ కి ఎవరు? అన్న టాపిక్ తెరపైకి వచ్చింది. అయితే ఈ పాత్రకు పింక్ ఒరిజినల్ లో నటించిన తాప్సీ అయితేనే బావుంటుందని భావిస్తున్నారట. వాస్తవంగా చూస్తే తాప్సీ కంటే నివేదా తెలుగు ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది. కానీ మేకర్స్ మాత్రం ఎందుకో తాప్సీ మీదనే ఉన్నారు.

 

అయితే ఇందుకు తాప్సీ ఓకే చెబుతుందా లేదా?  పవన్ కల్యాణ్ కాల్షీట్లతో తాప్సీ కాల్షీట్లు సింక్ అవుతుందా? అంటూ రకరకాల సందిగ్ధతలు నెలకొన్నాయట. అయితే పవన్ సరసన ఆఫర్ కి తాప్సీ అంగీకరించే అవకాశం ఉందని జోరుగా ప్రచారం సాగుతోంది. ఒకవేళ తాప్సీ ఓకే చెబితే ఇదే తొలి మెగా సినిమా అవుతుంది తన టాలీవుడ్ కెరీర్ లో. ఇక తాప్సీ బాలూవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ బిజి బిజీగా ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: