మహేష్ బాబు హీరోగా చేస్తున్న సినిమా సరిలేరు నీకెవ్వరూ షూటింగ్ వేగంగా జరుగుతున్నది.  సినిమాపై అంచనాలు ఒక లెవల్లో లేవు.  ఓ పల్లెటూరి సెట్స్ లో షూటింగ్ చేస్తున్నారు.  అలా షూటింగ్ చేస్తున్న సమయంలో అనుకోకుండా ఓ గెస్ట్ వచ్చారు.  ఆ గెస్ట్ ను చూసి ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు.  యూట్యూబ్ లో ఆమె ఓ సంచలనం.  


మై విలేజ్ షో అనే యూట్యూబ్ ఛానల్ లో సందడి చేసే గంగవ్వ సరిలేరు నీకెవ్వరూ సెట్స్ లో సందడి చేసింది.  అనిల్ రావిపూడితో సరదగా చిట్ చాట్ చేసింది.  అనిల్ ను కొన్ని ఫన్నీ ప్రశ్నలు అడిగి ఆకట్టుకుంది. తనను హీరోయిన్ గా పెట్టి సినిమా తీస్తావా అని అనిల్ రావిపూడిని అడగడంతో హీరోగా ఎవరిని పెట్టాలి అని అనిల్ అడగడంతో నవ్వులు పూశాయి.  అక్కడి నుంచి గంగవ్వ అనే ప్రశ్నలు అడిగింది.  


విజయశాంతి ఇన్నేళ్లు దూరంగా ఉండి ఇప్పుడు సినిమాల్లోకి వచ్చింది కదా ఆమెను పెట్టి సినిమా తీస్తున్నారు.. మరి నాకు కూడా అవకాశం ఇవ్వాలని అడిగినపుడు అనిల్ కొన్ని ఫన్నీగా సమాధానం చెప్పాడు.  విజయశాంతి అప్పటికి ఇప్పటికి ఒకేలా ఉన్నది.  ఎలాంటి మార్పు రాలేదు.  అందుకే ఆమెను పెట్టి సినిమా తీస్తున్నట్టు చెప్పారు.  అనంతరం గంగవ్వ సెట్స్ లో కలియతిరుగుతూ ప్రతి ఒక్కరిని ఆప్యాయతగా పలకరించింది.

 
సెట్స్ లో మహేష్ బాబు తదితరులతో గంగవ్వ ఫోటోలు దిగింది.  సరిలేరు నీకెవ్వరూ సినిమా వచ్చే ఏడాది జనవరి 11 వ తేదీన రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే.  ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రెండు సింగిల్స్ ను రిలీజ్ చేశారు.  రెండు కూడా ఆకట్టుకున్నాయి.  మూడో సింగిల్ వచ్చే సోమవారం రోజున రిలీజ్ చేయబోతున్నారు.  రష్మిక మందన్న హీరోయిన్ గా చేస్తున్న ఈ మూవీలో విజయశాంతి కీలక పాత్ర పోషిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: