బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ క్రేజ్ అనేది అమాంతం పెరిగిపోయింది. నేషనల్ స్టార్ గా మారిపోయాడు బాహుబలి. ఇక అక్కడి నుంచి అతని మార్కెట్ కూడా అమాంతం పెరుగుతూ వస్తోంది. ఇతర భాషల్లో మార్కెట్ ఉండటం, అక్కడ కూడా ప్రభాస్ కి అభిమానులు ఉండటంతో అతనితో సినిమా చేయడానికి దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. మార్కెట్ భారీగా ఉండటంతో లాభాలు కూడా భారీగా వస్తాయి అని భావిస్తున్నారట నిర్మాతలు. అందుకే ప్రభాస్ తో సినిమా కోసం భారీ ప్రయత్నాలు చేస్తున్నారు.

 

సాహో త‌ర్వాత ప్ర‌భాస్ ప్ర‌స్తుతం న‌టిస్తోన్న జాన్ సినిమా సైతం రు.150 కోట్ల భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కుతోంది. ఈ సినిమాకు జిల్ ఫేం రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌భాస్ కు అన్ని భాషలలోను మంచి మార్కెట్ ఉండటంతో సినిమాల మీద పెట్టుబడులు పెట్టాలి అనే ఆలోచనలో ఉండే వాళ్ళు కూడా ప్రభాస్ వైపు చూస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణా ప్రాంతానికి చెందిన బిజెపి ఎంపీ ఒకరు ప్రభాస్ తో సినిమా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

 

ప్రభాస్ తో తమిళ దర్శకుడు శంకర్ భారీ సినిమాకు సిద్దమవుతున్నారు అనే ప్రచారం జరుగుతుంది. ఆ సినిమా వచ్చే ఏడాది నుంచి మొదలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అనే టాక్ ఎక్కువగా వినపడుతుంది. దీంతో ఆ సినిమాలో కనీసం తాను సహా నిర్మాతగా అయినా ఉంటానని... ఆ ఎంపీ ప్రయత్నాలు చేస్తున్నారట. ఇప్పటికే ప్రభాస్ ని కూడా కలిసి చర్చించినట్టు సమాచారం.

 

శంకర్ తో కూడా మాట్లాడే ప్రయత్నాలు చేస్తున్నారని... తమిళనాడు లో తనకు ఉన్న పరిచయాల ద్వారా ఆయన ప్రభాస్ తో సినిమా చేసే ఆలోచన చేస్తున్నారట... శంకర్ సినిమా ఆలోచనలో ఉన్నా నిర్మాత ఎవరు అనేది మాత్రం ఇంకా ఖరారు చేయకపోవడంతో ఆ ఎంపీ గారు తన ప్రయత్నాలు తాను చేస్తున్నట్టు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: