ఒరిజినల్ వెర్షన్ ను డైరెక్ట్ చేసిన గౌతమ్ తిన్ననూరినే ఈ రీమేక్ ను తెరకెక్కిస్తుండగా ప్రముఖ టాలీవుడ్ నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు.. అమన్ గిల్ తో కలిసి నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్ ఇంతకుముందు బాలీవుడ్ లో అమీర్ ఖాన్ తో గజినీ రీమేక్ ను నిర్మించగా .. దిల్ రాజు కు అలాగే గౌతమ్ కు మాత్రం హిందీలో ఇదే మొదటి సినిమా. ఇక ఈసినిమా కోసం షాహిద్
క్రికెట్ లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడు. ఈసినిమా లో కోచ్ పాత్రలో షాహిద్
తండ్రి పంకజ్ కపూర్ నటిస్తుండగా మృణాల్ ఠాకూర్
హీరోయిన్ గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని ఆగస్టు 28 , 2020లో ప్రేక్షకులముందుకు తీసుకురానున్నారు.