ఈఏడాది  టాలీవుడ్ లో  విడుదలైన  సినిమాల్లో  అత్యధిక శాతం ప్రేక్షకుల మనసు గెలుచుకున్న చిత్రం  జెర్సీ.  ఈచిత్రం భారీ స్థాయిలో  కలెక్షన్స్ ను రాబట్టలేకపోయింది కానీ విమర్శకులను సైతం  ఫిదా చేసింది.  స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో  గౌతమ్ తిన్ననూరి  డైరెక్షన్ లో  తెరకెక్కిన ఈ చిత్రంలో  నాచురల్ స్టార్ నాని హీరోగా నటించాడు.  ఇక ఈ కల్ట్ మూవీని  ఇప్పుడు  బాలీవుడ్ యంగ్ హీరో  షాహిద్ కపూర్ తో  హిందీలో  రీమేక్ చేస్తున్నారు.  నిన్ననే ఈ సినిమా షూటింగ్  కూడా  స్టార్ట్ అయ్యింది. 
 
ఒరిజినల్  వెర్షన్ ను డైరెక్ట్ చేసిన గౌతమ్ తిన్ననూరినే  ఈ రీమేక్ ను తెరకెక్కిస్తుండగా  ప్రముఖ టాలీవుడ్ నిర్మాతలు  అల్లు అరవింద్, దిల్ రాజు..  అమన్ గిల్ తో కలిసి నిర్మిస్తున్నారు.  అల్లు అరవింద్ ఇంతకుముందు బాలీవుడ్ లో  అమీర్ ఖాన్ తో గజినీ  రీమేక్  ను నిర్మించగా .. దిల్ రాజు కు అలాగే  గౌతమ్ కు  మాత్రం హిందీలో  ఇదే మొదటి సినిమా. ఇక ఈసినిమా కోసం  షాహిద్  క్రికెట్ లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడు.  ఈసినిమా లో కోచ్ పాత్రలో  షాహిద్  తండ్రి పంకజ్  కపూర్ నటిస్తుండగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా కనిపించనుంది.  ఈ చిత్రాన్ని ఆగస్టు 28 , 2020లో  ప్రేక్షకులముందుకు తీసుకురానున్నారు.  
 
 ఇదిలా ఉంటే షాహిద్ కపూర్  ఇటీవల  కబీర్ సింగ్ తో  ప్రేక్షకులముందుకు వచ్చి భారీ హిట్ కొట్టాడు.  బ్లాక్ బాస్టర్ తెలుగు మూవీ అర్జున్ రెడ్డి  రీమేక్ గా తెరకెక్కిన  ఈ చిత్రం బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తూ  270కోట్ల వసూళ్లను రాబట్టి  ఈఏడాది హిందీ లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ చిత్రంగా  రికార్డు సృష్టించింది.  మరి ఇప్పుడు ఈజెర్సీ రీమేక్  షాహిద్ కు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.     
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: