కార్తికేయ హీరోగా తన బ్యానర్ పై ఓ సినిమా చేస్తానని గతంలోనే ప్రకటించాడు నిర్మాత అల్లు అరవింద్. కొన్నాళ్ల కిందట వచ్చిన గుణ369 సినిమా ఫంక్షన్ కు ప్రత్యేక అతిథిగా వెళ్లిన అరవింద్, అప్పుడే కార్తికేయకు మాటిచ్చాడు. చెప్పినట్టుగానే కార్తికేయ హీరోగా కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది.

 


భలే భలే మగాడివోయ్, గీతా గోవిందం వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన గీతా ఆర్ట్స్2 బ్యానర్ పై ఆర్.ఎక్స్ 100 సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తికేయ హీరోగా తెరకెక్కబోతున్న చిత్రం "చావు కబురు చల్లగా". కౌశిక్ పెగళ్లపాటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నారు. 2020లో షూటింగ్ జరుపుకోనున్న ఈ మూవీ విభిన్నమైన కథాంశంతో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మాతగా రానుంది. ఎన్నో విభిన్నమైన పాత్రలో నటించిన కార్తికేయ ఈ మూవీలో బస్తీ  బాలరాజు పాత్రలో కనిపించబోతున్నాడు. 

 


వరుసగా యంగ్ హీరోస్ తో సినిమాలు సెట్ చేస్తోంది గీతాఆర్ట్స్-2 బ్యానర్. ఇప్పటికే నిఖిల్ హీరోగా, వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమా ఎనౌన్స్ చేసింది. ఇప్పుడు కార్తికేయ హీరోగా ఇంకో సినిమా. త్వరలోనే రాజ్ తరుణ్ హీరోగా కూడా ఓ సినిమా ప్రకటించబోతోంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో రూపొందనున్న మూవీ లో కార్తికేయ హీరోగా ఎంపిక అయ్యారని సమాచారం. అనేక సూపర్ డూపర్ హిట్ మూవీస్ నిర్మించిన గీతా ఆర్ట్స్ బ్యానర్ లో కార్తికేయ కు అవకాశం రావడం కార్తికేయ క్రేజ్ కు నిదర్శనం. ఈ మూవీ కి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

 

దర్శకుడు కౌశిక్ చెప్పిన పాయింట్ నచ్చి నిర్మాత బన్నీ వాసు ఈ సినిమాను కార్తికేయతో చేయనున్నారు. ఈ చిత్రం గురుంచి మరిన్ని విశేషాలు చిత్ర యూనిట్ త్వరలో తెలుపనుంది. బ్యానర్ :జిఎ2 పిక్చ‌ర్స్‌, సమర్పణ : అల్లు అరవింద్, నిర్మాత : బన్నీ వాసు, సహ నిర్మాత : సునీల్ రెడ్డి,  డైరెక్టర్ : కౌశిక్ పెగళ్లపాటి.

మరింత సమాచారం తెలుసుకోండి: