యువ హీరో కార్తికేక ఆరెక్స్ 100 సినిమాతో అదరగొట్టాడు. తొలి సినిమా ప్రేమతో మీ కార్తిక్ ఎవరికి తెలియకున్నా సరే రెండో సినిమా ఆరెక్స్ 100తో పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వరుసగా మూడు సినిమాలు చేశాడు కార్తికేయ. అయితే అవేవి మంచి ఫలితాన్ని ఇవ్వలేదు. లేటెస్ట్ గా వచ్చిన 90 ఎం.ఎల్ సినిమా కూడా నిరాశపరచింది. అందుకే కెరియర్ లో జాగ్రత్త పడుతున్న కార్తికేయ లేటెస్ట్ గా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో సినిమా కన్ఫాం చేశాడు.

 

అప్ కమింగ్ హీరో అంత పెద్ద ప్రొడక్షన్ లో ఛాన్స్ రావడం నిజంగా లక్కీ అని చెప్పాలి. 90 ఎం.ఎల్ కన్నా ముందు కార్తికేయ నటించిన గుణ 369 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అరవింద్ వెల్ కం టూ గీతా ఆర్ట్స్ అనేశాడు. సో ఆ టైంలోనే గీతా ఆర్ట్స్ లో కార్తికేయ సినిమా కన్ ఫాం అయినట్టు తెలిసింది. ఇక లేటెస్ట్ గా ఆ సినిమాకు సంబందించిన అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ చేశారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో కార్తికేయ హీరోగా తెరకెక్కుతున్న సినిమా చావు కబురు చల్లగా.      

 

ఈ సినిమాను కౌశిక్ డైరెక్ట్ చేస్తున్నాడు. సినిమాలో కార్తికేయ బస్తీ బాలరాజుగా నటిస్తున్నారు. సినిమా టైటిల్ చావు కబురు చల్లగా అని పెట్టారు. అయితే ఈ టైటిల్ ఎనౌన్స్ మెంట్ చేసిన దగ్గర నుండి కొందరు పాజిటివ్ గా కొందరు నెగటివ్ గా స్పందిస్తున్నారు. ఇంతకుమించిన టైటిల్ ఏది దొరకలేదా చిత్రయూనిట్ కు అంటూ కొందరు అంటుంటే ప్రస్తుత ట్రెండ్ కు పర్ఫెక్ట్ టైటిల్ అని కొందరు అంటున్నారు.

 

యూత్ ఆడియెన్స్ లో ఓ సెపరేట్ క్రేజ్ కోసం ప్రయత్నిస్తున్న కార్తికేయ సినిమాల సెలక్షన్స్ లో కాస్త ఆచితూచి అడుగులేయాల్సిన అవసరం ఉంది. ఆరెక్స్ 100 తర్వాత హీరోగా నటించిన 3 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయితే విలన్ గా నటించిన నాని గ్యాంగ్ లీడర్ పర్వాలేదు అనిపించింది. మరి కార్తికేయ చావు కబురు చల్లగా సినిమా అతనికి ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: