సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ సినిమా సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమాకు సంబంధించి పాటలతో సూపర్ హిట్ కొడదామని చూశారు చిత్ర యూనిట్. అందులో భాగంగానే మొదట మాస్ సాంగ్ రిలీజ్ చేశారు. అది కాస్తా అట్టర్ ఫ్లాప్ అయింది. తర్వాత మెలొడీ రిలీజ్ చేశారు. అది కూడా అంతగా క్లిక్ అవ్వలేదు. దీంతో ఇప్పుడు అందరి చూపు సోమవారం రిలీజ్ అవ్వబోతున్న మూడో సింగిల్ పై పడింది. హీ ఈజ్ సో క్యూట్ అనే లిరిక్స్ తో సాగే పాటను సోమవారం సాయంత్రం 5 గంటలకు విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు రష్మిక టిక్ టాక్ వీడియోతో చిన్నపాటి ప్రమోషన్ కూడా షురూ చేశారు. 

 

అయితే పాటలతో పని జరగడం లేదని యూనిట్ కు అర్థమైపోయినట్టుంది. అందుకే ఓవైపు పాటల్ని రిలీజ్ చేస్తూనే, మరోవైపు ప్రచార వీడియోలు రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇందులో భాగంగా మరో 4 రోజుల్లో సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టులు చిట్ చాట్ చేసుకునే ఓ వీడియోను రిలీజ్ చేయబోతున్నరని ఫ్రెష్ అప్‌డేట్. ఇక అక్కడ్నుంచి విజయశాంతి, రష్మిక, బండ్ల గణేశ్ వీడియోలతో పాటు చివర్లో మహేష్ వీడియోను కూడా రిలీజ్ చేయబోతున్నారట. వీడియోస్ ని కేరళలో షూట్ చేసిన సంగతి తెలిసిందే.

 

సినిమా పాటలతో ఇప్పటికే ఓ రేంజ్ లో ట్రోలింగ్ కు గురవుతున్నాడు దేవిశ్రీప్రసాద్. ఓవైపు తమన్ కంపోజ్ చేస్తున్న అల వైకుంఠపురములో, ప్రతి రోజూ పండగే పాటలు సూపర్ హిట్ అవుతుండడంతో డీఎస్పీపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా రిలీజ్ అవబోయో సాంగ్ హిట్ అవ్వకపోతే దేవిశ్రీకి మరిన్ని కష్టాలు తప్పవని చెప్పుకుంటున్నారు. అంతేకాదు ఒకవేళ సినిమా మ్యూజిక్ పరంగా ఫ్లాప్ అయితే మాత్రం అది దేవిశ్రీ మీదే పడుతుందని ఓపెన్ గానే చెప్పుకుంటున్నారు. మరోవైపు దేవిశ్రీతో సంబంధం లేకుండా, ప్రమోషనల్ వీడియోస్ తో పాటు ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కూడా ఫిక్స్ చేశారు. జనవరి 5న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సరిలేరు నీకెవ్వరు ప్రీ-రిలీజ్ ఫంక్షన్ నిర్వహించబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఇందుకు సంబంధించి తాజాగా మహేష్ బాబుకు చెందిన బ్రాండ్ న్యూ పోస్టర్ ను కూడా విడుదల చేశారు.  


 

మరింత సమాచారం తెలుసుకోండి: