ప్రస్తుతానికి రాష్ట్ర రాజకీయాలతో చాలా బిజీ జీవితం గడుపుతున్నటువంటి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలు తీయాలని అభిమానులు అందరూ కూడా గట్టిగా కోరుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఒక ప్రైవేట్ మీడియా ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తనకు, పార్టీని నడపడానికి ఆదాయం కావాలని అందుకు తాను సినిమాలను నిర్మిస్తానని వెల్లడించారు. ఈమేరకు చిరంజీవి తనయుడు రాంచరణ్ తో కూడా ఒక సినిమాని నిర్మిస్తానని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. అయితే ఈ సినిమాకు ఇంకా దర్శకుడు ఫైనల్ కాలేదని, అందుకనే సినిమా లేట్ అవుతుందని పవన్ స్పష్టం చేశారు.

 

ఇకపోతే తాను రాంచరణ్ తో చేయబోయే సినిమాకు సంబందించిన విషయాలన్నీ కూడా అధికారికంగా త్వరలోనే వెల్లడిస్తానని పవన్ కళ్యాణ్ తెలిపారు. కాగా రాజకీయాలతో బిజీగా ఉన్నటువంటి పవన్, మళ్ళీ తాను సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చే విషయం పై ఇప్పటికి కూడా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదని తెలుస్తుంది. కాగా తాను మళ్ళీ నటిస్తాడా అనే అంశాన్ని పక్కనబెడితే, ఇకమీదట తాను సినిమాలు నిర్మిస్తాడని స్పష్టంగా అర్థమవుతుంది.

 

ఇదిలా ఉండగా చరణ్ మరో క్రేజీ ప్రాజెక్ట్ ని నిర్మించబోతున్నాడని, ఆ చిత్రంలో తన బాబాయ్ పవన్ కళ్యాణ్ హీరోగా న‌టిస్తున్నాడ‌న్న పుకార్లు కూడా వినిపిస్తున్నాయి. మ‌రి ఎంత వ‌ర‌కు నిజ‌మ‌నేది తెలియాల్సి ఉంది.  అజ్ఞాతవాసి తర్వాత పవన్ కళ్యాణ్ మరో చిత్రంలో నటించలేదు. పవన్ పూర్తిగా రాజకీయాలకే పరిమితమయ్యారు. అయినా కూడా ఆయ‌న సినిమాల్లో న‌టిస్తున్న‌ట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కోసం ఏఎం రత్నం, మైత్రి మూవీస్, హారిక అండ్ హాసిని సంస్థలు ఎదురుచూస్తున్నట్లు.. కానీ ప‌వ‌న్ మాత్రం సినిమాల ఊసే లేకుండా త‌న ని తాను చేసుకెళుతున్నారు. సినిమా నిర్మిస్తానని అప్పుడెప్పుడో పవన్ కల్యాణ్ చేసిన ఓ ప్రకటన మెగా అభిమానులను ఆనందానికి గురిచేసింది. ఆ ఇద్దరు కలిసి పనిచేస్తే చూడాలని మెగా అభిమానులు సైతం చాలాకాలంపాటే ఎదురుచూశారు. కానీ ఆ తర్వాత పవన్ కల్యాణ్ జనసేన పార్టీ(Jana Sena Party) స్థాపించి రాజకీయాలతో బిజీ అవడంతో ఆ సినిమా పట్టాలెక్కనేలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: