కోలీవుడ్ స్టార్ ధనుష్ రీసెంట్ గా అసురన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. 2019 లో ధనుష్ 100 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాగా రికార్డ్ క్రియోట్ చేశాడు. ఇదే సినిమాని తెలుగులో విక్టరి వెంకటేష్ హీరోగా రీ మేక్ చేయబోతున్నారు నిర్మాత సురేష్ బబౌ. ఇక కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా, దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఎనై నోకి పాయుమ్ తోట’. ఈ రొమాంటిక్ థ్రిల్లర్ను తెలుగులో ‘తూటా’ పేరుతో విడుదల చేస్తున్నారు. గొలుగూరి రామకృష్ణారెడ్డి సమర్పణలో విజయభేరి వారి బ్యానర్పై జి.తాతా రెడ్డి, జి.సత్యనారాయణ రెడ్డి ఈనెల 27న విడుదల చేస్తున్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
చిత్ర విడుదల తేదీ ప్రకటన సందర్భంగా నిర్మాతలు జి.తాతరెడ్డి, జి.సత్యనారాయణ రెడ్డి చిత్ర విశేషాలను తెలియ చేశారు. ‘‘ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్కు, ట్రైలర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ధనుష్కి కోలీవుడ్తో పాటు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉండడం మాకు కలిసొచ్చే అంశం. ఇటీవల ఈ చిత్రం తమిళంలో విడుదలై సూపర్ హిట్ అయ్యింది. తెలుగులో కూడా ఈ సినిమా విజయంపై కాన్ఫిడెంట్గా ఉన్నాం’’ అని తెలిపారు.
కాగా, ఈ సినిమాలో ధనుష్ సరసన మేఘా ఆకాష్ హీరోయిన్గా నటించారు. నిజానికి మేఘా ఆకాష్ తొలి చిత్రమిది. కాకపోతే సినిమా అనివార్య కారణాల వల్ల బాగా ఆలస్యమైంది. తమిళంలో గౌతమ్ మీనన్ స్వయంగా నిర్మించిన ఈ సినిమా చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తుంది. దాదాపు రెండున్నరేళ్లుగా ఈ సినిమాను విడుదల చేసేందుకు అన్నీ రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు గౌతమ్ మీనన్. మొత్తానికి ఆయన ప్రయత్నాలు ఫలించాయి. మరి ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏ మేర మెప్పిస్తుందో చూడాలి. ఇక మేఘా ఇప్పటి వరకు తెలుగులో చేసిన సినిమాలు అంతగా మెప్పించలేకపోయాయి. మరి ఈ సినిమాతోనైనా బ్రేక్ వస్తుందేమో చూడాలి.