సినిమాల్లో ఒకప్పుడు వెలుగు వెలిగిన రోజా ప్రస్తుతం రాజకీయాల్లో కీరోల్ పోషిస్తున్నారు. ప్ర‌స్తుతం నగిరి ఎమ్మెల్యే రోజా తరచుగా వార్తల్లో నిలుస్తుంటారు. వైసిపిలో కీలక నేత అయిన రోజా ఆ పార్టీ తరుపున వరుసగా రెండవసారి ఎమ్మెల్యేగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన సంగతి తెలిసిందే. రోజా రాజకీయాల్లో కొనసాగుతూనే బుల్లితెరపై జబర్దస్త్ షోలో జడ్జ్ గా అందరిని ఆకట్టుకుంటున్నారు. జబర్దస్త్ నుండి నాగబాబు క్విట్ కావడంతో సింగిల్ గానే జడ్జ్ సీట్‌లో కూర్చుంది రోజా. నాగబాబు ఉంటే ఇద్దరికీ కలిపి బిస్కెట్స్ వేసే హైపర్ ఆది.. సింగిల్ జడ్జ్‌గా రోజా ఉండటంతో నాగబాబు డోస్‌ని కూడా కలిపి రోజాపైనే వేస్తున్నాడు.

 

ఇక తాజాగా  రోజా న్యూ ఇయర్ సందర్భంగా ఈటీవీలో ‘ఆడవారి పార్టీలకు అర్ధాలే వేరులే’ అనే ప్రోగ్రామ్ చేసింది. రీసెంట్‌గా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను మల్లెమాల వాళ్లు రిలీజ్ చేసారు. ఈ ప్రోమోలో రోజాతో పాటు హైపర్ ఆది, మరో యాంకర్  వర్షిణి ఉన్నారు. మొన్నే పటాస్ షోలో ఆడియన్స్ లో ఓ అబ్బాయి బుగ్గకొరికిన వర్షిణి, తాజాగా హైపర్ ఆదిని అమాంతం తన బిగికౌగిలిలో బంధించి. ఏకంగా పైకి ఎత్తుకొని తన సత్తా చాటింది. మరోవైపు హైపర్ ఆది సైతం కొంటెగా సైగలు చేస్తూ వర్షిణి చేసిన పనిని ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపించింది.

 

ఈ సందర్భంగా వర్షిణి.. హైపర్ ఆది ఉద్దేశించి ఇపుడు ఏంమంటావ్ అని అడగగా.. మరో ఎత్తితే బాగుండు అని హైపర్ ఆది పంచ్ వేయడం అందరినీ నవ్వించింది. ఈ క్ర‌మంలోనే రోజా రంగ ప్రవేశం చేయడంతో వర్షిణి.. హైపర్ ఆదిని ఉద్దేశిస్తూ.. ఇతడు పనోడు అంది. దానికి రోజా.. అయితే ప్రెస్ మీట్ పెట్టు .. హైపర్ ఆదికి ఆర్డర్ పాస్ చేసింది రోజా. కానీ హైపర్ ఆది మాత్రం.. ఇది మీరనకున్న పార్టీ కాదు.. ఆడవారి పార్టీలకు అర్ధాలే వేరు అని చెప్పి పంచ్ వేయడంతో రోజా ఏం మాట్లాడ‌లేక‌పోయింది. దీంతో వ‌ర్షిణి ఊపందుకుంది.
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: