టాలీవుడ్ స్టార్ కమెడియన్ అలీ ఇంట్లో విషయం నెలకొంది.. ఈ మధ్య అలీ టీవీ ప్రోగ్రామ్స్ లో హోస్ట్ గా వ్యవహరిస్తూ ప్రజల్ని ఆకర్షిస్తున్నారు..కాని మన అందరికి నవ్వులని అందించే అలీ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.. అలీ తల్లి గారు అయిన జైతున్ బీబీ అనారోగ్యం తో మృతి చెందారు.

 

అలీ అమ్మగారు రాజమహేంద్రవరంలోని ఆమె స్వగృహంలో ఉంటున్నారు.. అయితే అనారోగ్యం కారణంగా రాజమహేంద్రవరంలోని స్వగృహంలో తుది శ్వాస విడిచారు.. జైతున్ బీబీ మృతదేహాన్ని హైదరాబాద్ తీసుకురానున్నట్లు సమాచారం.. అయితే గురువారం సాయంత్రం అంత్యక్రియలు చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం అలీ రాంచీలో షూటింగ్ లో ఉన్నారు.. తల్లి తిరిగిరాని లోకాలకి వెళ్లిందన్న విషయం తెలిసి హైదరాబాద్ బయలుదేరారు.

 

అలీ కాళీ సమయాలలో తల్లి తో కలిసి సమయం గడిపోయేవారని ఒక ఇంటర్వ్యూ లో తెలిపారు. ఎంత గొప్ప నటుడు అయిన తల్లిముందు చిన్నపిల్లవాడే కదా.. షూటింగ్ లో ఎంత బిజీ అయిన అమ్మని మరిచేవాడు కాదట.. అలీ తన ఎదుగుదలకి కారణం తన అమ్మ అని.. చిన్నప్పటి నుంచి నన్ను నా తమ్ముడిని ఎంతో గొప్పగా చూడాలని అనుకుంది అని, అమ్మ వాల్లే మేము ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నామని తెలిపారు....

 

అలీ తల్లి మృతిపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖలు తీవ్ర సంతాపం వ్యక్తం చేసారు.రీసెంట్‌గా ప్రముఖ రచయత నటుడు గొల్లపూడి మారుతిరావు కాలం చేసి వారం కూడా కాలేదు. అపుడే టాలీవుడ్‌లో అలీ ఇంట్లో  విషాదం నెలకొంది.

 

ఆలీ కి ఒక తమ్ముడు ఉన్నాడు అతని తమ్ముడు ఖయ్యుమ్... తమ్ముడు కూడా సినీ ఇండస్ట్రీలో నటిస్తున్నారు..అలీ మాత్రం చిన్నప్పటి నుండి సినిమాల్లో నటిస్తూ ఉన్నారు. చిన్నప్పటి నుండే ఆలీకి సినిమాలంటే ఇష్టం. అమ్మ ప్రోత్సాహం వల్ల సినిమాలో రాణించగలిగారట.. ఇంత మంచి పేరు సంపాదించడానికి కారణం అమ్మ అని ఒక ఇంటర్వ్యూ లో తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: